కాంగ్రెస్ పార్టీలో మంటలు రేగాయి. అసలే ఇప్పడు కాంగ్రెస్ పార్టీ ఆంద్రప్రదేశ్ లో మునిగిపోయే పరిస్థితుల్లో ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం నాయకులను నమ్ముకొని, సీమాంద్ర నాయకులను దూరంగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ నాయకులు పట్టపగలే చుక్కలు చూపించారు. అసలే చలి జ్వరంతో బాదపడుతున్న కాంగ్రెస్ పార్టీ లో కేంద్ర మంత్రి జైరాం రమేష్ మంటలే రేపాడు.
ఆయన నోటి దూల వలనే..కాంగ్రెస్ పార్టీ నాయకుల మద్య విబేధాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడితే.. ఒక దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసిఆర్ మాటలు నీటి మూటలే అని తెలిపోవటంతో, జైరాం రమేష్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే.. దళితుడ్ని సీఎంగా చేస్తానని మీడియా ప్రకటన చేయటం జరిగింది.
దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఖంగుతిన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి మీద ఆశపెట్టుకున్న నాయకులు జైరాం రమేష్ మాటలతో గోడలు దూకే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం.
జైరాం రమేష్ మాటలతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా మండిపడినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ పెద్దలతో సమావేశం అయిన సోనియాగాంధీ, జైరాం రమేష్ వ్యాఖ్యలపై నీళ్లు చల్లే పనిని , రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ అప్పచెప్పినట్లు సమాచారం.
దీంతో రంగంలోకి దిగిన డిగ్గీ రాజా, కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తి గతం అని మీడియా ద్వారా చెప్పటం జరిగింది. దీంతో ఈ ఇద్దరి మద్య తీవ్రమైన మాటల యుద్దం జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఢిగ్గీ రాజా ప్రకటనతో.. గోడలు దూకే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఊపిరీ పీల్చుకున్నారు.
అయితే కాంగ్రెస్ హైకమాండ్ నుండి జైరాం కు అంక్షింతలు పడినట్లు ఢిల్లీ పెద్దలు అంటున్నారు. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, సీమాంద్ర నాయకులతో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ కావటానికి సిద్దమైనట్లు సమాచారం.
అయితే ముందుగా రెండు రాష్ట్రాల్లో పీసీసీ అద్యక్షులను నియమించే పనిలో కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే డిగ్గీ రాజా ప్రకటనతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఊపిరీ పీల్చుకున్నారు. జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ , టీఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేసిన ఆశ్చర్యం లేదని రాజకీయ మేథావులు అంటున్నారు.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more