తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలివి తెలంగాణ రాష్ట్రానికి సిఎం కావటానికి కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పాడితే.. మొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణ దళితుడే. తెలంగాణ ఉద్యమ నేత, టీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల కేసిఆర్ అనేక సార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు .. ముఖ్యమంత్రి పదవి పై కన్నుపడింది.
కేంద్రస్థాయిలో ఉన్న జైపాల్ రెడ్డి లాంటి వారికే తెలంగాణ ముఖ్యమంత్రి కావాలనే కోరికతో.. ఆయన ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి సిద్దమైనట్లు సమాచారం. ఇదే బాటలో డీఎస్ శ్రీనివాసరావు, కె. జనారెడ్డి, విహెచ్ హనుమంతరావు లు ఎమ్మెల్యేగా పోటీ చేయటానికి కాంగ్రెస్ హైకమాండ్ తో మంతనాలు జరుపుతున్నారు.
తెలంగాణ వస్తే దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసిఆర్ సైతం మాట తప్పి, ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు సమాచరం. అంటే ఇప్పుడు అందరి కళ్లు తెలంగాణ ముఖ్యమంత్రి పదవి పైనే ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ కూడా కేసిఆర్ పంథాలోనే అడుగులు వేస్తుంది. ఈరోజు జైరాం రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి ఒక దళితుడ్ని ముఖ్యమంతిని చేస్తామని ప్రకటన చేయటంతో తెలంగాణలో రాజకీయం పూర్తిగా రంగులు మారిపోయింది.
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో ముఖ్యమంత్రి కావాలనే ఆశ పుట్టిన వెంటనే.. కాంగ్రెస్ హైకమాండ్ పురిటిలోనే చంపివేయటంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు దీర్ఘమైన ఆలోచనలు చేస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంతో.. టీఆర్ఎస్ పార్టీలో అలజడి మొదలైంది. మంథాజగన్నాథం, వివేక్ , నాయకులు కాంగ్రెస్ పై అడుగులు వేస్తున్నట్లు సమాచారం. వీరు కూడా రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు పోటీ చేసే ఆలోచనల్లో ఉన్నట్లు టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.
జైరాం రమేష్ చేసిన ప్రకటనతో.. మాజీ మంత్రి గీతారెడి, దామోదర్ రాజనరసింహ, ఎమ్మెల్యే శంకరరావు లాంటి నాయకులు చాలా ఉత్సహంగా కనిపిస్తున్నారని గాంధీ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ..కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ కలిసిపోయిన ఆశ్చర్యంలేదని . రాజకీయ మేథావులు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more