నిన్నటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కి అతి సన్నిహితురాలుగా ఉంటూ.. తెలంగాణ లీడర్ గా పేరు తెచ్చుకున్న రాష్ట్ర మంత్రి డికె. అరుణ .. ఒక్కసారిగా ఎదురుతిరిగింది. నిన్న ఢిల్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆద్వర్యంలో .. సమైక్యంద్ర కోసం మౌన దీక్ష చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో నల్లారి నోటి నుండి సడన్ గా.. జై సమైక్యంద్ర అంటూ.. నినాదం చేయటంతో.. అక్కడ రాజకీయ పరిస్థితి ఘోరంగా మారిపోయింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. జై సమైక్యంద్ర అనటంతో.. అక్కడే.. ఉన్న తెలంగాణ మంత్రులకు గుండె జారిపోయినట్లు అయింది.
అయితే వెంటనే.. అక్కడే ఉన్న మంత్రి గీతా రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, డి.కె. అరుణ.. జై తెలంగాణ .. జై .జై తెలంగాణ అంటూ.. నినాదాలు చేయటంతో.. ఢిల్లీ పోలీసులకు ఏం జరుగుతుందో తెలియక.. అక్కడి వారిని చెదరగొట్టే పనిలో పడ్డారు. ఈ సందర్బంలో.. గీతారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కిందపడిపోవటంతో.. డి.కె. అరుణ లో ఒక్కసారిగా ఆవేశంతో ఊగిపోయారు. దీంతో.. డికె. అరుణ.. సిఎం కిరణ్ ఎక్కిన బస్సు ముందు నిలబడి.. జై తెలంగాణ... అంటూ నినాదాలు చేస్తూ.. సీమాంద్ర నేతల పై మండిపడ్డారు. సీఎంకు.. సీమాంద్ర నాయకులకు సిగ్గులేదని శాపనార్థలు పెట్టారు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. నిన్న ఢిల్లీలో రచ్చ రచ్చ చేసింది కాంగ్రెస్ నాయకులే కావటం విశేషం. ప్రతిపక్షపార్టీ నాయకులు .. మాత్రం పాత వేషాలు వేసి పరువు పొగొట్టుకున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం రెండు ప్రాంతాల వారిగా విడిపోయి , ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది.. కాంగ్రెస్ పార్టే, రొడ్డుమీదకొచ్చి కొట్టుకునేది.. కాంగ్రెస్ పార్టీ నాయకులే కావటం ఆశ్చర్యంగా మారిందని మీడియా వర్గాలు అంటున్నాయి. అయితే .. అధికార పార్టీ నాయకుడే.. సొంత పార్టీ పై సమరానికి దిగితే.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేస్తుందనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావాలనే.. ఢిల్లీలో.. ఆంద్రప్రదేశ్ నాయకులతే.. వీధి నాటకం ఆడిస్తుందని .. రాజకీయ మేథావులు అంటున్నారు. కేవలం టైం పాస్ కోసమే.. తెలంగాణ రాష్ట్రం పేరుతో.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అష్టచష్మ ఆడుతూ.. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మేకలుగా వాడుకుంటుందనే విషయం ప్రతిఒక్కరికి అర్థమవుతుందని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు.
అయిన.. ఢికె. అరుణ.. సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పై తిరగబడటం చూసిన .. తెలంగాణ ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే.. తెలంగాణ ఆడబిడ్డల పౌరుషం ఏమిటో ఢిల్లీలో చూపించారు కాబట్టి. కానీ సీమాంద్ర ప్రజలు మాత్రం .. సమైక్య వీరుడని చెప్పుకుంటున్న సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తీరు పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. మాజీ మంత్రి జేసి దివాకర్ రెడ్డి .. నిన్న ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అని.. సీమాంద్ర సీనియర్ నాయకులు అంటున్నారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి సమైక్యాంద్ర కావాలి? తెలంగాణ నేతలకు.. తెలంగాణ రాష్ట్రం కావాలి? కాంగ్రెస్ పార్టీకి.. రెండు ప్రాంతాల ప్రజల ఓట్లు కావాలి? అయితే చివరకు ఏం జరుగుతుందో చూద్దాం..
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more