చంద్రబాబులో కొత్త ఆశలు రేకేత్తున్నాయి. నిన్నటి వరకు ఇంటికే పరిమితమైన చంద్రబాబు ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా రైతులకు, ప్రజలకు వరద తాకిడి తాకిన విషయం తెలిసిందే. గతంలో ఉత్తరాఖండ్ లో వచ్చిన వరద బాధితులను ఆదుకొని పార్టీకి ఇమేజ్ పెంచుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అల్పపీడన ద్రోణి, బుతుపవనాల కలియికతో.. రాష్ట్రంలో వరద పోటుకు ప్రజలు గురైన విషయం తెలిసిందే. అరుదుగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఒక పక్క సమైక్యాంద్ర కోసం వైఎస్ జగన్ హైదరాబాద్ నగరంలో సమైక్య శంఖరావం అంటూ సభ ఏర్పాటు చేసి .. కాంగ్రెస్ పార్టీని, చంద్రబాబును టార్గెట్ చేస్తే, చంద్రబాబు సైలెంట్ గా.. కాంగ్రెస్ పార్టీకి, జగన్ పార్టీల మద్య ఉన్న చీకటి ఒప్పందం గురించి వరద బాధితుల ముందు గీతోపదేశం చేసి, పార్టీకి మైలేజ్ పెంచుకుంటున్నారు.
సమైక్యాంద్ర కోసం సీమాంద్ర ప్రజలు రెండు నెలల నుండి ఉద్యమం చేస్తూంటే రానీ కాంగ్రెస్ సీమాంద్ర నాయకులు .. వరద బాధితులను ఆదుకోవటానికి కాంగ్రెస్ సీమాంద్ర నాయకులు క్యూ కట్టారు. దీంతో సీమాంద్ర ప్రజలకు ఆవేశం ఆకాశానికి చేరి, సీమాంద్ర నాయకులపై దాడులు, రాళ్లదాడులు, వ్యతిరేకతలు రుచి చూపించారు. అదే బాటలో వరద బాధితులను పరామర్శిస్తున్న చంద్రబాబుకు .. సీమాంద్ర ప్రజలు హారతి పడుతున్నారు. ఇదే అదునుగా చంద్రబాబు దూకుడు పెంచారు. వైసీపీ సమైక్యవాదం బూటకమని..అంతా సోనియా ఆడిస్తున్న నాటకమని టీడీపీ అభివర్ణిస్తోంది. దీనికితోడు వైసీపీ సమైక్యశంఖారావం సభకు అటు టీఆర్ఎస్ నుంచి..ఇటు టీ కాంగ్రెస్ నుంచి ఎలాంటి అడ్డంకులు లేకపోగా...సర్కార్ వైపు నుంచి చాలా సహకారం అందినట్టు వస్తున్న ఆరోపణలు ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి. దీనికితోడు కాంగ్రెస్ నేతలు లగడపాటి రాజగోపాల్, జేసీ దివాకర్ రెడ్డిలతోపాటు మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డితోపాటు మరికొందరు ఎంపీలు జగన్...కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాన్ని బయటపెడుతుండటంతో అసలు బండారం తెలిపోతోంది.
చంద్రబాబు కేవలం విభజన రాజకీయాలకేపరిమితం కాకుండా బాధల్లో ఉన్న జనాన్ని పరామర్శించేందుకు వరద ప్రాంతాల పర్యటన జోరుగా సాగిస్తూ...తనదైన శైలిలో సర్కార్ ను ఇరుకునపెట్టడం ఆసక్తికలిగిస్తోంది. తొండంగి మండలం పెరుమాళ్లపురంలో వరద బాధితులతో కలిసి చంద్రబాబు ఆకస్మిక ధర్నా దిగడంతో కలకలం రేగింది. అధికార యంత్రాంగం తరలివచ్చి..అప్పటికప్పుడు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడతామని భరోసాఇచ్చింది. వరద బాధితలు కన్నీళ్లు తుడిచేందుకు నేనున్నానంటూ దూసుకుపోతున్న చంద్రబాబును చూసి ఇక...సీఎం కిరణ్...మంత్రులు అక్కడక్కడా పర్యటనలు చేస్తున్నప్పటికీ అంతగా ఉపయోగం లేదనుకుని కాంగ్రెస్ లో కదలికవచ్చింది. ఏకంగా ప్రధాని మన్మోహన్, సోనియాలు రాష్ర్ట పర్యటనకు సిద్ధం కావడం వరద రాజకీయంలో హైలెట్ గా మారింది. అయితే సోనియా, మన్మోహన్ రాకలతో రాష్ట్రంలో రాజకీయ మార్పులు ఎలా ఉంటాయో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more