ప్రకాశం జిల్లాలో ఒక్కరోజే ఏకంగా 34 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గ్రామంలోకి భారీగా వరదనీరు వచ్చింది. దీంతో అక్కడి ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాలో 22 పునారావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6,500మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక బస్సు వాగులో చిక్కుకుపోయింది. బస్సు దాదాపు పైభాగం వరకు కూడా నీళ్లు రావడంతో అందులోని కొందరు ప్రయాణికులు బస్సు టాప్ మీదకు ఎక్కి నిలబడ్డారు. ఎట్టకేలకు అధికారులు వారిని రక్షించగలిగారు.
అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. ఒంగోలులోని పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తాళ్లూరు, ముండ్లమూరు, అద్దంకి వంటి ఎగువ మండలాల్లోని వాగులు, చెరువు అలుగులు పొంగిపొర్లటంతో గుండ్లకమ్మ రిజర్వాయర్కు వరద నీరు పొటెత్తింది.
దీంతో సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తమై గుండ్లకమ్మ రిజర్వాయర్కు చెందిన పది గేట్లను ఎత్తివేసి దిగువకు 85వేల క్యూసెక్కుల వదర నీటిని దిగువకు విడుదల చేశారు. మద్దిరాలపాడు బ్రిడ్జి వద్ద 15 అడుగులకుపై నీరు ప్రవహిస్తోంది. దాంతో ఒంగోలు-చీరాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పల్లికురవ బలదిగ్బంధంలో చిక్కుకుంది. విద్యుత్ సబ్స్టేషన్లోకి వరద నీరు చేరటంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
ఇక యద్దనపూడి మండలంలో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కలెక్టర్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ముంపు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అధికారులు అప్రమత్తమై ఉండాలని ఆదేశించారు. మార్కాపురం లో పత్తి పంట పూర్తిగా దెబ్బతింది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more