ఫైలిన్ తుపాను ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి పెను ప్రమాదంగా మారుతుంది. ఫైలిన్ తుపాన్ బీభత్సం దాటికి మత్య్సకారుల కుటుంబాలు, తీర ప్రాంతం వెంబడి గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పైలిన్ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోని తూర్పు తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. సహాయక చర్యలపై సిఎం కిరణ్ కలెక్టర్లు, అధికారులతో ఫోన్ లో సమీక్ష జరిపారు. ఫైలిన్ తుపాను ప్రభావం, సహాయక చర్యలపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల ఉన్నతాధికారులతో సిఎం కిరణ్ ఫోన్ లో మాట్లాడారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని సిఎస్ మహంతికి ఆదేశాలు జారీ చేశారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ బృందాల సహాయం తీసుకోవాలని సూచించారు.
తుపాను నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంతాలలో సహాయక చర్యలు చేపట్టారు. 850 సురక్షిత ప్రదేశాలను గుర్తించారు. ఇప్పటికే 64 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సహాయక చర్యలపై సిఎం మరోసారి సమీక్ష జరపనున్నారు. ఫైలిన్ తుపాను నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఫైలిన్ తుపాన్ వాయవ్యదిశగా కదిలి పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతోంది. కళింగపట్నానికి 315 కి.మీ, గోపాల్ పూర్ కు 315 కి.మీ, పారాదీప్ కు 355 కి.మీ దూరంలో ఫైలిన్ కేంద్రీకృతమై ఉంది. 54 అడుగులకు పైగా ఎత్తులో అలలు ఎగసిపడి తీరంపై విరుచుకుపడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
విజయనగరం : ఫైలిన్ తుపాను కారణంగా విజయనగరం జిల్లాలో అధికారులు హై అలర్టు ప్రకటించారు. సాయంత్రం 6 గంటల నుండి అర్థరాత్రి 12 లోగా తీరం దాటే అవకాశముంది. 4 అడుగుల ఎత్తున సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. భారీ స్థాయిలో ఈదురు గాలులు వీస్తూ అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. అధికారులు అప్రమత్తమయ్యారు. వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులను అప్రమత్తం చేసి, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులను, సహాయ చర్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
23 గ్రామాలు లోతట్టు ప్రాతంలో ఉన్నాయి. 6 గ్రామాలు సముద్రానికి అతి చేరువలో ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. తీర ప్రాంతాల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. 40 మంది సభ్యులతో కూడిన రెస్క్యూ టీం ను అధికారులు సిద్ధం చేశారు. తుపాన్ బాధితులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి బియ్యం, నిత్యవసర సరుకులను అందిస్తున్నారు. పురపాలక సంఘాల్లో తాగునీటి సరఫరాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 23 గ్రామాల్లో 20 నుండి 40 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చింది. ఒడ్డున ఉన్న వలలు, బోట్లు కొట్టుకుపోయాయని మత్య్సకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే మత్య్సకారులను అప్రమత్తం చేశారు. ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలోని మూడు గ్రామాలపై తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఒరిస్సాలో వర్షాలు కురిస్తే నాగావలి నది పొంగి పొర్లుతుంది.
విశాఖ: ఫైలిన్ తుపాను తన ప్రతాపం చూపెడుతోంది. విశాఖ శివసాయినగర్ లో సముద్రం ముందుకు వచ్చింది. దీంతో పదుల సంఖ్యలో మత్య్సకారుల ఇళ్లు నేలమట్టమయ్యాయి. తీరం భారీగా కోతకు గురైంది. మత్య్సకారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు తీరాన్ని చిన్నాభిన్నం చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తుపాను బీభత్సం సృష్టించడంతో మత్య్సకారులు భయాందోళనకు గురవుతున్నారు. సముద్రపు అలలు రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. దీంతో భీమిలి బీచ్ వద్ద 80 అడుగుల మేర రక్షణ గోడ కూలిపోయింది. ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇసుక బస్తాలు వేసి రక్షణ గోడను తిరిగి నిర్మిస్తున్నారు.
తూ.గో : ఫైలిన్ తుపాన్ వేగంగా దూసుకొస్తోంది. తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడలో సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు. అలలు రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. వేగంగా వీస్తున్న ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉప్పాడ గ్రామంలో తీర ప్రాంతపు రోడ్లు నీటి ముంపుకు గురవుతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. తీరప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మత్య్సకారులు వేటకు వెళ్లకూడదంటూ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సముద్రం పోటెత్తుండటంతో ఉప్పెన ముప్పు పొంచి ఉందని అధికారులు భావిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తీర ప్రాంత ప్రజలు బయటకు రావొద్దని
త్రివిధ దళాలను అప్రమత్తం చేశాం'
ఫైలిన్ తుపాను సహాయక చర్యల్లో భాగంగా త్రివిధ దళాలను అప్రమత్తం చేశామని విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ రాధ తెలిపారు. ప్రస్తుతం తుపాను 200 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొన్నారు. ఈ సాయంత్రానికి తీరం దాటొచ్చని వివరించారు. విపత్తును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అప్రమత్తంగా ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు.
కూలిన రక్షణ గోడ
ఫైలిన్ తుపాను ధాటికి అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో భీమిలి బీచ్ వద్ద 80 అడుగుల మేర రక్షణ గోడ కూలిపోయింది. ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఇసుక బస్తాలు వేసి రక్షణ గోడను నిర్మిస్తున్నారు.
ఇళ్లు నేలమట్టం
ఫైలిన్ తుపాను తన ప్రతాపం చూపెడుతోంది. విశాఖ శివసాయినగర్ లో సముద్రం ముందుకు వచ్చింది. దీంతో పదుల సంఖ్యలో మత్య్సకారుల ఇళ్లు నేలమట్టమయ్యాయి. తీరం భారీగా కోతకు గురైంది. మత్య్సకారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు తీరాన్ని చిన్నాభిన్నం చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తుపాను బీభత్సం సృష్టించడంతో మత్య్సకారులు భయాంతో వణికిపోతున్నారు.
శ్రీకాకుళం : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.రాత్రి నుండి ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఫైలిన్ తుపాను నేపథ్యంలో జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. జిల్లాలో 37 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎట్టిపరిస్థితుల్లో రేపు సాయంత్రం వరకు బయటకి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more