పార్టీకి జనం బలం పెరుగుతున్న సమయంలో పార్టీ పై విషప్రయోగం జరిగింది. అసలే అధినేత అందుబాటులో లేక అతలకుతలమవుతున్న పార్టీలోకి జంపు జిలానీల రాకతో పార్టీలోని నాయకులు మద్య విబేధాలు, తలెత్తాయి. ఢిల్లీ పెద్దలకు కంటిమీద నిద్రలేకుండా చేస్తున్న పార్టీగా ప్రజలు గుర్తించారు. కానీ ఏ సమయంలో ఏం జరిగిందో గానీ, పార్టీలో రాజీనామాల పర్వంతో రెండు ప్రాంతాలుగా నాయకులు విడిపోయి, మీడియా ముందు కాకీ గోల చేశారు. కానీ చివరకు ఫలితంగా.. ఒక ప్రాంతంలో కొంచెం నెమ్మదిగా తిరుగుతున్న ఫ్యాన్ రెక్కలు విరిచి , కరెంట్ లేకుండా చేశారు. అసలు ఇప్పుడు పూర్తిగా ఫ్యాన్ గుర్తే ఆ ప్రాంతంలో కనిపించకుండా చేస్తున్నారు ఆ ప్రాంత నాయకులు. తెలంగాణ ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాదాపు జెండా పీకేసే పరిస్థితులు నెలకొన్నాయి. ప్లీనరీలో చేసిన తీర్మానానికే కట్టుబడి ఉంటామని పార్టీ ప్రకటించినా అంతర్గతంగా సీమాంధ్రకే పరిమితం కావాలని నిర్ణయించుకుందనేది బహిరంగ రహస్యం.
పార్టీలో అసమ్మతి గళమెత్తిన కొండా సురేఖ వాదన తెలంగాణపై కాదని ఎప్పటి నుంచో ఉన్న విబేధాలేనని మిగిలిన నేతలు చెప్తున్నా క్యాడర్ మొత్తాన్ని చీల్చేందుకు కొండా దంపతులు వ్యూహరచన చేస్తున్నట్లు తెలియవచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 20 మంది వరకు కన్వీనర్లతో కొండా వర్గం గచ్చిబౌలిలో రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సమావేశంలో కొందరు పార్టీ ప్లీనరీకి కట్టుబడి ఉంటున్నట్లు ప్రకటించింది కదా రాజీనామా చేయటమెందుకని ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే అవకాశవాద రాజకీయాలను నడుపుతున్నందునే తాము పార్టీని వీడి వెళ్లాల్సి వచ్చిందని రాజీనామా చేసిన నాయకులు స్పష్టం చేసినట్లు చెప్తున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని కొండా దంపతులు సమావేశంలో ప్రస్తావించారని తెలిసింది. ఇప్పటికే కొండాతో పాటు నలుగురు నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. మిగిలిన సమన్వయ కర్తలతో పాటు కార్యకర్తలను కూడగట్టుకుని మూకుమ్మడిగా బోర్డు తిప్పేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
అంతేకాదు తమను అవమానించిన జగన్కు తగిన రీతిలో షాక్ ఇచ్చేందుకు కొండా వర్గం పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. స్వయాన కొండా సురేఖ వైకాపాకు తన సత్తా చూపాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఏ పార్టీలో చేరాలనే విషయమై సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. జగన్కు మద్దతుగా ఇప్పటి వరకు కాంగ్రెస్ను దుమ్మెత్తిపోసి తిరిగి పార్టీలో చేరితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే భావనతో బిజెపిలో చేరాలని ముందుగా నిర్ణయించుకున్నారు. అయితే తమ రాజకీయ గురువు, పిసిసి మాజీ చీఫ్ డి.శ్రీనివాస్తో ఉన్న సాన్నిహిత్యం వల్ల కాంగ్రెస్లో చేరాల్సిందిగా ఒత్తిడి పెరిగిందని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more