ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంద్ర నాయకులు మద్య మాటల యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే మాటలు యుద్దం దాటిపోయ, ఇరువురువు వ్యక్తిగత విషయాలపై దాడులు చేసుకుంటున్నారు. వ్యక్తిగత విషయాలు ముదిరిపోయి.. ఇప్పుడు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేస్థాయిలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పోరాటం చేస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఫైనల్ వార్నింగ్ అంటూ.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కి హెచ్చరించారు. మంత్రి గంటా శ్రీనివాస్రావు ఆస్తులపై సీబీఐచే విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నిజమాబాద్ లోక్సభ సభ్యుడు మధుయాష్కీ డిమాండ్ చేశారు. ఈ మేరకు తానే సీబీఐకు త్వరలో ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సమైక్యవాదాన్ని గట్టిగా వినిపిస్తున్న మంత్రి వెనుక ఎవరున్నారో తమకు తెలుసుకునని అన్నారు.
మధుయాష్కీ మాట్లాడుతూ, గంటాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అక్రమంగా ఆస్తులను కూడబెట్టడంలో మంత్రిది అందవేసిన చేయి అని ఆరోపించారు. తెలంగాణలో పెద్దఎత్తున పెట్టుబడులు ఉన్న కారణంగానే గంటా సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణను దోచుకున్నది ఆయనకు ఇంకా సరిపోలేదా? అని మధుయాష్కీ ప్రశ్నించారు. ఇలా మాటలు శ్రుతిమించి వార్నింగ్ అంటూ ఇవ్వటంతో.. నాయకులు మద్య యుద్ద వాతావరణం నెలకొంది. ఇలాంటి నాయకులపై కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఏం చెయ్యటం లేదు. ఇలాంటి వాతావరణంలో రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మొన్న తెలంగాణ నాయకుడు మాకు తుపాకులు పట్టడం వచ్చు అని , కాంగ్రెస్ మంత్రికి సవాల్ విసిరారు. ఇరువైపుల నాయకులు మాటలతో రాష్ట్రం ప్రజలకు భయందోళన కలిగిస్తున్నారు. తెలంగాణకు అడ్డుపడితే..ఎవరినైనా ఏమైన చేస్తాం అని తెలంగాణ నాయకులు వార్నింగ్ ఇవ్వటంతో సీనియర్ రాజకీయ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more