Fear for sonia gandhi with ys jaganmohan reddy

fear for sonia gandhi with ys jaganmohan reddy, jagan on cbi case, sonia target ys jagan, telangana issue, congress party, why sonia fears jagan, jagan mohan reddy, ysr congress party, ysr, breaking news, ap politics, political news, andhra news

Fear for Sonia Gandhi with YS Jaganmohan reddy

సోనియాలో పెరుగుతున్న జగన్ భయం..?

Posted: 06/28/2013 01:51 PM IST
Fear for sonia gandhi with ys jaganmohan reddy

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షరాలు సోనియా గాంధీ కి ఆంద్రప్రదేశ్ రాజకీయలు పెద్ద తలనొప్పిగా మారాయి. అధిష్టానం ముందు ఇప్పుడు రెండు పెను సమస్యలు ఉండటంతో, ఢిల్లీ నాయకులకు నిద్రపట్టడం లేదు. మొదటి సమస్య తెలంగాణ రాష్ట్ర సమస్యతో నలిగిపోయిన సోనియాగాంధీ తెలివిగా తప్పించుకోని ఫ్లాన్ దొరికింది. తెలంగాణ సమస్య సోనియా గాంధీ లైటుగా తీసుకున్నట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు. కానీ రెండో సమస్యతో సోనియా గాంధీలో వణుకు మొదలైందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. రెండో సమస్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు సోనియా గాంధీ కంట్లో నలుసుగా మారిపోయాడు వైఎస్ జగన్. సోనియాగాంధీ ఫోకస్ మొత్తం జగన్ పై పెట్టినట్లు సమాచారం.

కాంగ్రెస్ పార్టీతో గొడవపడి బయటకు వెళ్లిన రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు .. తమ తప్పులు తెలుసుకోనో, కాంగ్రెస్ పార్టీ భయపెట్టో, మొత్తం మీద మళ్లీ కాంగ్రెస్ పార్టీ తో రాజకీయాల సంబందాలు కొనసాగిస్తారు. ఉదాహరణకు.. తమిళనాడు ఢిఎంకే పార్టీ అధినేత కరుణానిధి.. రీసెంట్ గా యూపీఏ తో సంబంధాలు తెంచుకోని బయటకు వెళ్లి కాంగ్రెస్ పార్టీని, సోనియా గాందీని, ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ ని, ఉప్పు నీళ్లతో కడిగిపాడేసారు. శ్రీలంకలో తమిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా కరుణానిధి యూపీఏ నుండి తప్పుకున్నాడు.

అయితే రెండు రోజుల క్రితం కరుణానిధి కూతురు కనిమొళి కోసం మళ్లీ సిగ్గువిడిసి.. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ సంబంధాలు కొనసాగించారు. కూతురు కోసం తమిళల ఆత్మగౌరవాన్ని గంగలో కలిపాడు కరుణానిధి. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా నిస్సగ్గుగా కరుణానిధికి రెడ్ కర్పెట్ పరిచి ఆహ్వానించింది. కనిమొళి 2జీ కుంభకోణం కేసులోచిక్కుకొని, కొన్ని రోజులు జైలు జీవితం గడిపి వచ్చిన ఆమెకు కాంగ్రెస్ పార్టీ, రాజ్యసభ ఎన్నిక సమయంలో మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆంద్రప్రదేశ్ రాజకీయాలు అలా కాదు, అందులోను వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ అలాంటి వ్యక్తి కాదని సోనియా గాంధీకి అర్థం అవుతుంది. వైఎస్ఆర్ ఏమిటో సోనియాగాంధీకి బాగా తెలుసు. వైఎస్ఆర్ లక్షణాలను పూనికి పుచ్చుకున్న వైఎస్ జగన్ కూడా ఎవరికీ లొంగే మనిషికాదని సోనియాగాంధీ కి ఎప్పుడో అర్థం అయింది.

ఎందుకంటే ఒక దళిత కాంగ్రెస్ నాయకుడు చేత జగన్ ఆస్తులపై సిబిఐ విచారణ చెయ్యాలని పిటిషన్ వేసి, వైఎస్ జగన్ ను అక్రమంగా అరెస్ట్ చేసి ఒక సంవత్సరం పాటు జైల్లో పెట్టినప్పటికి, వైఎస్ జగన్ ఇమేజ్ పెరిగింది గానీ కొంచెం కూడా తగ్గలేదనే విషయాన్ని కొన్ని సర్వేలు బహిరంగా చెప్పడంతో రోజు రోజుకు సోనియా గాంధీలో భయం పెరిగిపోతుందని ఢిల్లీ నాయకులు అంటున్నారు. ఆ భయంతోనే తెలంగాణ సమస్య కంటే ముందు వైఎస్ జగన్ పై ద్రుష్టి పెట్టినట్లు సమాచారం. వైఎస్ జగన్ ను రాష్ట్రం జనం నుండి దూరం చేసే ప్రక్రియాలో భాగంగా కేంద్ర కెబినెట్ లో తొమ్మిదిమంది సీమాంద్ర నాయకులకు చోటు కల్పించింది సోనియాగాంధీ. తెలంగాణ నుండి కేవలం ముగ్గురికి మాత్రమే స్థానం కల్పించింది. ఈ విషయాన్ని చూస్తే సోనియాలో భయం ఏ రేంజ్ లో ఉందో అర్థమవుతోంది. సీమంధ్ర నాయకులతో జగన్ కు చెక్ పెట్టే ఆలోచలనో సోనియా గాంధీ ఉన్నట్లు సమాచారం.

ఆమె కు అసలు భయం ఒక్కటే? వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశలు కనుచూపు మేర కనిపించటంలేదు? జైల్లో శిక్షనైన అనుభవిస్తాను... గానీ కాంగ్రెస్ పార్టీతో కలిసే ప్రసక్తి లేదని జగన్ చెప్పే మొండి దైర్యమే మౌనంగా చెబుతుంది. వైఎస్ జగన్ మౌనమే సోనియాలో పెరుగుతున్న భయం. జగన్ ఏడాది పాటు జైల్లో ఉండి కూడా, బయట తన పార్టీని బలపేతం చెయట్యమే ఆమె భయానికి కారణం. అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీల నుండి జగన్ పార్టీలోకి సీనియర్ రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో చేరటంతో ఆమెలో భయం పెరిగిపోతుంది.

జగన్ జైల్లో ఉండే ఇంత చేస్తే, అదే జగన్ బయట ఉంటే ఏం జరిగేందో కాంగ్రెస్ నాయకులకు బాగా తెలుసుత. జగన్ బయట ఉండి ఉంటే..ఈపాటికి మద్యంతర ఎన్నికలు ఎప్పుడో జరిగిపోయేవి అని చెబుతున్న సర్వేలతో సోనియా గాంధీ లో భయం పెరిగినట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు. ఏమైన 2014 ఎన్నికల్లో ఎన్ని మార్పులు జరుగుతాయో చూద్దాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more