ముఖ్యమంత్రి పదవిని తన కొడుకు అఖిలేష్ చేతిలో పెట్టి, రాజకీయాలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకుంటున్న ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్, తన కొడుకు చేస్తున్న పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన కొడుకు పాలన బాగాలేదని బహిరంగంగా ప్రకటన చెయటం జరిగింది. అంతేకాకుండా.. తన కొడుకును కించపరుస్తూ .. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై పొగడ్తల వర్షం కురిపించారు. నా కొడుకు కంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్ బాగుందని ములాయింసింగ్ అన్నారు.
అంతేకాకుండా నేనే ఇప్పుడు ముఖ్యమంత్రి గా ఉంటే.. కేవలం 15 రోజుల్లో ఉత్తరప్రదేశ్ లో శాంతిభద్రలను అదుపులో ఉండేవాడినని ఆయన చెప్పటం పై పార్టీ నాయకులు షాక్ తిన్నారు. బీహార్ రాష్ట్రం అభివృద్ది పధంలో నడుస్తుందని ప్రశంసల వర్షం కురిపించారు తమ రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తప్పు చేసిన అధికారులను జైలుకు పంపడానికి కూడా అఖిలేష్ వెనుకంజ వేయరాదని ఆయన సలహా ఇచ్చారు. జిల్లా న్యాయమూర్తులను, ఎస్పీలను కూడా బాధ్యులు చేయాలని అప్పుడే అవి తగ్గుముఖం పడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. తప్పుచేస్తే వారిపై చర్య తీసుకోవడానికి వెనుకంజ వేయరాదని ఆయన అఖిలేష్ యాదవ్కు సూచించారు. అఖిలేష్ పై తాను ఎటువంటి వత్తిడి తీసుకురావడం లేదని ఆయన వెల్లడించారు.
గత 15, 20 రోజులుగా తాను అఖిలేష్తో మాట్లాడలేదని, ఏవిషయంలోనైనా చర్య తీసుకోవడానికి ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉన్నదని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమేనని, ఈ విషయంలో ఆయనకు మినహాయింపు లేదని ములాయం వివరించారు. అయితే ములాయింసింగ్ తన కొడుకు అఖిలేష్ యాదవ్ పై చేసిన వ్యాఖ్యలు పార్టీల్లో పెను దుమారం రేపాయి. ములాయింసింగ్ మాటల్లో కొత్త అర్థం కనిపిస్తుంది. అఖిలేష్ యాదవ్ ను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాల్సింది అన్నట్లుగా ఆయన పరోక్షంగా ఇలాంటి విమర్శలు చేశారా? లేక గాడి తప్పుతున్న తన కొడుకు పాలనను .. దారిలో తెచ్చేందుకు ములాయింసింగ్ తన కొడుకు అఖిలేష్కు చురకలు అండించారా అనేది తెలియాక పార్టీ నాయకులు సతమతమవుతున్నారు. తండ్రి ఇచ్చిన షాక్ కు కొడుకు అభిలేష్ ఎలాంటి సమాదానం చెబుతాడో వేచి చూద్దాం..
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more