రాష్ట్రంలో ఉన్న పాఠశాలలకు, కాలేజీలకు సమ్మర్ సెలవులు నడుస్తున్నాయి. అయితే ఇదే మంచి అదునుగా భావించి రాజకీయ పార్టీలు తమ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు , రాజకీయ పాఠాలు చెప్పేపనిలో బిజీగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ మినీ మహనాడు పేరుతో కార్యకర్తలకు కొత్త పాఠాలు నేర్పుతుంది. అలాగే టీఆర్ఎస్ పార్టీ కూడా తమ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు జిల్లా స్థాయిలో టీఆర్ఎస్ క్లాసులు పేరిట, రాజకీయ, ఉద్యమా పాఠాలు నేర్పించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం పేరుతో కార్యకర్తలు, రాజకీయ నాయకులు, మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు.
అయితే విస్తృతస్థాయి సమావేశంలో రాష్ట్ర ముఖ్యనేతలకు ఘాటైన షాకిచ్చారు కార్యకర్తలు. కొంతమంది నాయకులు సిగ్గుతో తలదించుకోని, మైక్ కట్ చేసి, కార్యకర్తలకు సర్థిచెప్పారు. రాష్ట్రంలో చాలామంది కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నారని, వారిని పట్టించుకోవాలని ఆ పార్టీకి చెందిన ఓ నేత వ్యాఖ్యానించారు. కాంగ్రెసు పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ప్రకాశం జిల్లా నుండి వచ్చిన ఓ నేత ఘాటుగానే మాట్లాడారు. కష్టకాలంలో ఉన్నప్పుడే పార్టీ నేతలకు కార్యకర్తలు గుర్తుకు వస్తారా? అని ప్రశ్నించారు. పార్టీ కోసం తాము జైళ్లకు వెళ్తున్నామని, నాయకులు ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. కార్యకర్తలు ముష్టివాళ్లలా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గాలలోని పరిస్థితి మీకు తెలియదన్నారు. తప్పుడు నివేదికలు వస్తున్నాయని చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకే విలువిస్తారా, కార్యకర్తలకు లేదా అని ప్రశ్నించారు. ఆయన ఘాటు వ్యాఖ్యలతో పెద్దలు అవాక్కయ్యారు. అలాగే కృష్ణా జిల్లా నుండి వచ్చిన మరో నేత కూడా ఇలాగే మాట్లాడే ప్రయత్నాలు చేయగా మైక్ కట్ చేశారు. విమర్శలు వద్దని బొత్స సర్ది చెప్పారు. త్వరలో స్థానిక ఎన్నికలు, ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను మన ప్రభుత్వం అమలు చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి అన్నారు. పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. జూన్, ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
బొత్స వ్యాఖ్యలపై విహెచ్ అసంతృప్తి పార్టీ నుండి వెళ్లే వాళ్లు వెళ్తారని, వాళ్లను ఆపలేమన్న బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. వెళ్లేవారు వెళ్తారనడం సరికాదని అలా అంటే వెళ్లమన్నట్లే అన్నారు. వెళ్లే వారిని ఆపే ప్రయత్నాలు చేయాలన్నారు. మొత్తం మీద బొత్స కు రాష్ట్ర ముఖ్యమంత్రి కి విస్తృతస్థాయి సమావేశంలో కొత్త విషయాలు తెలిశాయని కార్యకర్తలు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more