కొడుకు బయటకు వస్తాడని ..కన్నతల్లి ఎదురుచూపు? భర్త రాక కోసం ఎదురుచూస్తున్న భార్య. ఇద్దరు అత్తాకొడళ్లు. ఇద్దరు ఆశలు ఒక్కేటే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయటకు రావాలి. ఒకరు రచయితిగా మారి తన భర్త కు జరుగుతున్న అన్యాయం పై కలంతో ప్రజలకు చెబుతున్న వైఎస్ భారతి. ఎమ్మెల్యేగా, ప్రజలకు ఒక యువ నాయకుడ్ని అధించాలనే తపనతో అల్లాడిపోతున్న వైఎస్ విజయమ్మ. తన కొడుకు రాక కోసం, దీక్షలు , పాదయాత్రలు చేస్తున్న ఫలితం ఇప్పటి వరకు దక్కలేదు. 11 నెలల నుండి విచారణ పేరుతో జైల్లో పెట్టి, బెయిల్ రాకుండా చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పై అత్తాకోడళ్ల పోరాటం చేస్తున్నారు. వారి మనస్సులో కొత్త ఆశలు పుట్టాయి. ఈనెల 27న వైఎస్ జగన్ కు బెయిల్ వస్తుందనే ఆశ వారిని ముందుకు నడిపిస్తుంది. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈ నెల 27 నుంచి తెలంగాణలో పర్యటించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇదే క్రమంలో ఈనెల 23న జగన్ బెయిల్ పిటిషన్పై తీర్పు వెలువడుతుండటంతో ఆ పార్టీ కొండంత ఆశగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే 11 నెలలుగా జైల్లో ఉన్న జగన్, ఆయన పార్టీ ఈ నెల 23న తమకు బెయిల్ దొరకుతుందని ఆశగా ఎదురుచూస్తోంది. ఇదివరకటి లాగే సిబిఐ ఈ ఇద్దరి బెయిల్కు గట్టిగా అడ్డుపడుతోంది. గతంలో మార్చి 31లోగా తుది ఛార్జిషీట్ను దాఖలు చేయాలన్న న్యాయస్థానం ఆదేశాలను ఈడి పూర్తిస్థాయిలో అమలు చేయలేదనే కారణంతో ఈసారి జగన్కు బెయిల్ ఇచ్చే అవకాశం ఉందని జగన్ తరఫు న్యాయవాదులు విశ్వాసంతో ఉన్నారు. ఇప్పటికే 11 నెలలుగా జైల్లో ఉన్నందున మరికొంత కాలం ఆయన వ్యక్తి గత స్వేచ్ఛను హరించలేమనే భావనతో బెయిల్ ఇవ్వవచ్చని ఆయన తరుఫు న్యాయవాదులు ఆశతో ఉన్నారు.
దీంతో సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ప్రభావంపై వైకాపా అంతర్గతంగా సమీక్షించుకొని ఒక ప్రణాళికను తయారు చేసుకొంది. ఒక వేళ 23న జగన్కు బెయిల్ వస్తే ఆ మరుసటి రోజు నుంచే తెలంగాణ ప్రాంత పర్యటన చేసే విధంగా కార్యక్రమాన్ని పార్టీ ఖరారు చేసింది. తొలుత నల్లగొండ జిల్లా నుంచే అప్పట్లో నిర్ణయించిన విధంగా ఓదార్పు యాత్రను జగన్ చేపట్టేలా వైకాపా ఖరారు చేసింది. ఒక్క రోజు విరామం తీసుకోకుండా తెలంగాణ జిల్లాల్లో మొత్తం సుడిగాలి పర్యటన జరుపుతారని పార్టీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. పార్టీ చేపట్టిన ఆకర్ష్కు స్పందనే లేకపోవడం కొత్తగా పార్టీలోకి ఎవ్వరూ రావడానికి సుముఖత చూపక పోవడం, ఇటీవల పార్టీలో చేరిన జలగం వెంకట్రావు వంటి నేతలు యూ టర్న్ తీసుకోవడం, వైఎస్ కుటుంబానికి తెలంగాణలో గట్టి మద్దతుదారుగా నిలిచిన కొండా సురేఖ కుటుంబం కూడా మౌనంగా ఉండిపోవడం వంటి పరిణామాలు వైకాపా శిబిరాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. పార్టీని పటిష్టం చేయడానికి నాయకత్వం రెండు ప్రత్యామ్నాయాలతో ప్రణాళికలను రూపొందించుకుంది. జగన్ విడుదల అయితే ఆయనతో సుడిగాలి పర్యటన చేయించడం, అలా సాధ్యపడక పోతే ఇటీవల ప్రకటించిన విధంగా గౌరవాధ్యక్షురాలు విజయమ్మచే ఈ నెల 27 నుంచి చేవెళ్ల నుంచి ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని చేపట్టి ఆ ప్రాంతంలో పార్టీకి నూతన జవసత్వాలు అందించాలని పార్టీని నడిపిస్తున్న సీనియర్ నేతలు తలపోస్తున్నారు. జగన్ బెయిల్పై వైకాపా గంపెడంత ఆశతో ఎదురుచూస్తున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు ఎటువంటి తీర్పు వెలువరుస్తుంది, బెయిల్ మంజూరవుతుందా లేదా అన్న అంశాలు ఆ పార్టీలోని అందరిలో తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. బెయిల్ మంజూరుకు, నిరాకరణకు సమానవకాశాలు ఉన్నాయని కొందరు న్యాయ నిపుణులు చెబుతుండడం ఆ పార్టీని హైటెన్షన్కు గురిచేస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more