మాటీవీ కార్యాలయంపై టీవీ ఆర్టిస్టులు దాడి జరిపారు. కార్యాలయంపై రాళ్ళు రువ్వి, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. డబ్బింగ్ సీరియల్స్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ గత కొంత కాలంగా బుల్లితెర ఆర్టిస్టులు ఆందోళనలు చేస్తున్న విషయం విధితమే. ఈరోజు ఒక్కసారిగా మాటీవీ కార్యాలయంపై టీవీ ఆర్టిస్టులు దాడి చేశారు. తమ డిమాండ్లను పట్టించుకోకుండా డబ్బింగ్ సీరియళ్లను ప్రసారం చేస్తున్న ఛానల్స్పై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్లోని మాటీవీ కార్యాలయం వద్దకు చేరుకున్న ఆందోళన కారులు డబ్బింగ్ సీరియళ్లను నిలిపి వేయాలంటూ దాడికి పూనుకున్నారు. మాటీవీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కార్యాలయంలో అద్దాలతో పాటు, ఫర్నీచర్ ధ్వంసమైంది. ఈ ఘటనలో కొందరు మాటీవీ సిబ్బంది కూడా గాయపడ్డట్లు సమాచారం. కార్యాలయం ఆవరణలో నిలిచి ఉన్న కార్ల అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఆందోళన కారులు రెండు కార్లలో వచ్చి ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మాటీవీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక్కసారిగా దాడి జరుగడంతో మాటీవీ ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. అయితే.... ఈ దాడిని తెలుగు టీవీ ఆర్టిస్టు పరిరక్షణ సమితి ఖండించింది. దాడుల వల్ల సమస్య పరిష్కారం కాదని పేర్కొంది. తమ ఉద్యమాన్ని నీరు గార్చేందుకే కొన్ని అసాంఘీక శక్తులు తమ పేరుతో ఈ దాడికి పాల్పడ్డట్లు సమితిలోని పలువురు సభ్యులు అనుమానం వ్యక్తం చేసారు. దీంతో కార్యాలయం సిబ్బంది పోలీసులకు ఫోన్ చేయగా వారు వచ్చేసరికి ఆర్టిస్టులు పారిపోయారు. ఒక్కరు కూడా సంఘటన ప్రాంతంలో లేరు. ఒక్క మీడియా మాత్రమే ఉంది. అయితే పోలీసులు మీడియా వద్ద ఉన్న విజువల్స్ ఆధారంగా దాడికి పాల్పడిన వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more