ఒక్కడు ... పదిమందితో కలిసి ... వందలమంది తోడురాగా.. వేల కొద్ి సమస్యలను ఆలకిస్తూ లక్షల మందికి చేరువవుతూ.. కోటి గొంతుకల ఆవేదన వింటూ .. పది కోట్ల మంది తెలుగు గుండెల ప్రతినిధిగా ప్రయణిస్తున్న ప్రయాణం ఈ రోజు వంద రోజులకు చేరుకుంది. ఈ వంద రోజుల్లో ఆయన వేసిన వేషాలు ఎన్నో, ఆయన నేర్చుకున్నభాషలు ఎన్నో? వస్తున్న మీ కోసం అంటూ చేస్తున్న పాదయాత్ర నేటికి 1600 కిలోమీటర్లు దూరం సాగింది. ఆయన క్రిస్మస్ తాత వేషానికి రాజకీయాలకు సంబంధం ఉండకపోవచ్చు.. రోడ్డు పక్కన మిర్చి బజ్జీలు వేసి అమ్ముతున్నట్టు నటించడానికి రాజకీయాలకు సంబంధం ఉండక పోవచ్చు. కానీ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వినూత్న తరహాలో ఈ వేషాలన్నింటిలో రంజింపజేశారు. అక్టోబర్ 2న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ‘వస్తున్నా మీ కోసం’ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాల మీదుగా తెలంగాణలో ప్రవేశించారు. రాయలసీమ జిల్లాల్లో ఆయన రాజకీయ యాత్రగానే పాదయాత్రను సాగించినప్పటికీ తెలంగాణలోకి ప్రవేశించిన తరువాత పాదయాత్రలో రోజుకో రూపం ధరించారు. కరీంనగర్ జిల్లాలో పులివేషం వేశారు, క్రిస్మస్కు క్రిస్మస్ తాత వేషం వేసి ఆకట్టుకున్నారు. ఆటో నడిపించారు. ఈత చెట్టు ఎక్కి కల్లు ముంత దించడమే కాకుండా కల్లు పోశారు. బతుకమ్మ ఆడారు, బోనం ఎత్తుకున్నారు.
పాదయాత్ర ప్రారంభానికి ముందు ప్రముఖ సినీ దర్శకులతో చంద్రబాబు తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ప్రజలతో సన్నిహితంగా ఉండాలని, వినూత్నంగా యాత్ర సాగించాలని వారు సూచించారు. వారి సూచనల ప్రభావమో లేక జిల్లాల్లో నాయకుల సూచనలో కానీ ఏ ప్రాంతంలో ఎవరు ఏ వేషం అన్నా చంద్రబాబు ఒప్పుకున్నారు. జై తెలంగాణ అని రాసి ఉన్న బోనం ఎత్తుకుని తరువాత దాన్ని కిందకు దించి జై తెలుగుదేశం అనే బోనం ఎత్తుకోవడం పట్ల తెలంగాణవాదులు విమర్శించారు. అయితే బాబు మాత్రం వాటిని పట్టించుకోకుండా బోనాలు, బతుకమ్మలను ఎత్తుకుంటూ యాత్ర సాగించారు. సాధారణంగా రాజకీయ నాయకులు మైనారిటీల వద్దకు వెళ్లినప్పుడు మైనారిటీల మాదిరిగా ముస్లిం టోపీ ధరించడం మినహా ఇతర వేషాల్లో కనిపించరు. కానీ చంద్రబాబు మాత్రం ఎప్పుడూ లేని విధంగా రోజుకో కొత్త రూపంలో దర్శనమిచ్చారు. ఎప్పుడూ ఆయన ధరించే ప్యాంటు షర్టులోనే యాత్ర సాగించినా, ఆ దుస్తుల్లోనే ఆయా ప్రాంతాలకు చెందిన ప్రత్యేక సంస్కృతిని ప్రదర్శించే అలంకరణలను ధరించారు.
ఆదిలాబాద్ గిరిజనులు నెమలి ఈకలతో తయారు చేసిన కిరీటం తరహా అలంకరణతో అక్కడి వారితో కలిసి ఆనందంగా గడిపారు. ఆటో నడిపించారు. ఇంటింటికి తిరిగి బుట్టలో గాజులు అమ్మేవారు కనిపించగానే నెత్తిపైన గాజుల బుట్ట ధరించి వారిని సంతోషపరిచారు. రోడ్డుపక్కన మిర్చిలు తయారు చేసేవారు కనిపిస్తే తానూ వెళ్లి మిర్చి బజ్జీలు వేశారు. ఎడ్లబండి ఎక్కారు. జాలరి మాదిరిగా నీటిలోకి వలను విసిరారు. బాణం వేశారు, గదను పట్టుకున్నారు. పొలం దున్నారు, ముస్లింల మాదిరిగా టోపి ధరించి ప్రార్ధన చేశారు.ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించి, ఢిల్లీలో చక్రం తిప్పి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడు ఇలా బహురూపాల్లో కనిపించడం వల్ల ప్రయోజనం ఏమిటని కొందరు నాయకులు ప్రశ్నిస్తుండగా, దీనివల్ల ప్రజల్లోకి సులభంగా వెళ్లగలిగామని కొందరు సమర్ధిస్తున్నారు. చంద్రబాబు జిల్లాకు వచ్చినప్పుడు ఆ జిల్లాలో ప్రాశస్త్యం ఉన్న పులివేషాన్ని వేసుకోమని దుస్తులు ఇస్తే ఎలా తిరస్కరిస్తారు, అదే విధంగా క్రిస్మస్ తాత వేషం దుస్తులు ఇచ్చారు, వాటిని కాదని ఎలా అనగలరని కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఫొటోల వల్ల ప్రచారం ఎక్కువగా లభిస్తోందని సమర్ధిస్తున్నారు.
ఆకట్టుకునే వేషంతో పాటు ప్రజలతో సన్నిహితంగా ఉండి వారితో పాటు తినడం, వారి యోగక్షేమాలు అడగడం వంటివి చేయడం వల్ల సామాన్యుల్లో కలిసిపోయినట్టు అయిందని పార్టీ నాయకులు తెలిపారు. పాఠశాలకు వెళ్లి పాఠం చెప్పడం, రైతులతో పొలం గురించి మాట్లాడడం వంటి వాటి ద్వారా సామాన్య జనం నాడి పసిగట్టడానికి అవకాశం లభించిందని టిడిపి నాయకులు చెబుతున్నారు. పాదయాత్ర బుధవారానికి వంద రోజులు అవుతుంది. వంద రోజుల పాదయాత్రలో వైఎస్ఆర్ పాదయాత్ర రికార్డును బ్రేక్ చేసినట్టు టిడిపి నాయకులు తెలిపారు. దీనికి గుర్తుగా వంద అడుగుల ఎత్తయిన పైలాన్ను ఖమ్మం జిల్లా మధిరాపురంలో నిర్మిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more