తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మంచి జోష్ మీద ఉన్నారు. తెలంగాణ పై కేంద్రంలో చర్చలు వేగవంతంగా జరుగుతున్నాయాని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. అమ్మ త్వరలో తెలంగాణ పై చల్లటి తీపి కబురు చెబుతుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆనందంలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వివాదాన్ని కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పార్టీ సీనియర్లతో విస్తృతంగా మంతనాలు సాగించారు. నెల రోజుల్లో తెలంగాణ జటిల సమస్యకు నిర్ణయం ప్రకటిస్తామని ఇటీవల జరిగిన అఖిలపక్ష సమావేశంలో కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభివృద్ధి మండలి ఏర్పాటా? విభజనకు పూనుకోవడమా? అన్న ప్రతిపాదనలను కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. కర్నాటక లేక డార్జిలింగ్ హిల్స్ కౌన్సిల్ మాదిరిగా తెలంగాణ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయటం ద్వారా సమస్యను పరిష్కరించగలుగుతామా? లేక విభజన ఒక్కటే పరిష్కారమా? అన్నది హైకమాండ్కు అంతుబట్టడం లేదంటున్నారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ లోక్సభ నాయకుడు, హోం మంత్రి సుశీల్కుమార్ షిండే, వైద్య ఆరోగ్య మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్తో సమావేశమై ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వివాదంపై అనుసరించాల్సిన పార్టీ విధానం గురించి చర్చించినట్టు తెలిసింది. రెండు ప్రతిపాదనలపై చర్చ సాగినట్టు సమాచారం. 2009 డిసెంబర్ 9న సోనియా పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు చేసిన ప్రకటనకు కట్టుబడి ముందుకు సాగితే ఎలా ఉంటుందనేది కూడా చర్చకు వచ్చిందని అంటున్నారు. అఖిలపక్ష సమావేశంతో ఉత్సాహంతో ఉన్న టి కాంగ్రెస్ శ్రేణులకు ఏఐసిసి అధికార ప్రతినిధి రషీద్ అల్వీ చేసిన ప్రకటన మరింత జోష్ నింపుతోంది. దేశంలోని ఇతర చిన్న రాష్ట్రాల డిమాండ్లతో తెలంగాణ అంశానికి సంబంధంలేదని ఆయన ఢిల్లీలోపేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్కుమార్షిండే చేసిన ప్రకటనయే కాంగ్రెస్ విధానమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ ఏర్పాటు ఖాయమన్న మరింత స్పష్టత వచ్చిందని టి కాంగ్రెస్ శ్రేణులు సంబరపడుతున్నారు.
అఖిల పక్షం తరువాత రాష్ట్ర విభజన జరగదని మంత్రి టి.జి.వెంక టేష్, ఎంపీ లగడపాటి రాజ్గోపాల్ ధీమా వ్యక్తం చేశారు. దీంతో టి కాంగ్రెస్ శ్రేణులు కూడా కొంత అనుమానానికి లోనయ్యారు. గతంలో మాదిరిగా పార్టీ హైకమాండ్ మోసం చేస్తుందా అన్న మల్లగుల్లాలు కూడా పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఒత్తిడితో పాటు తెలంగాణ ఇవ్వకపోతే భవిష్యత్ కార్యాచరణకు సిద్దం కావాలని వారు నిర్ణయించుకొన్నారు. కానీ తాజాగా రషీద్ అల్వీ వ్యాఖ్యలతో టి కాంగ్రెస్ శ్రేణులకు ఉత్సాహం వస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ రెండు రాష్ట్రాలకు కట్టుబడి ఉందన్న సంకేతంతోపాటు, చర్చా అజెండాలో కూడా ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని షిండే చేర్చారని ఆ పార్టీ తెలంగాణ శ్రేణులు పేర్కొంటున్నాయి. తాజాగా రషీద్ అల్వీ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అధినాయకత్వం నిర్ణయమేనని వారు భావిస్తు న్నారు. గతంలో తెలం గాణ అంశం ఎప్పుడు తెరపైకి వచ్చినా దేశంలో తెలంగాణ తోపాటు అనేక ప్రాంతా ల్లో చిన్న రాష్ట్రాల డిమాండ్లు ఉన్నాయన్న విషయాన్ని పార్టీ అగ్రనేతలు పలు మార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ అందుకు భిన్నంగా ఇతర చిన్న రాష్ట్రాల డిమాండ్తో తెలంగాణకు సంబంధంలేదని చెప్పడం ప్రత్యేక రాష్ట్రం విషయంలో పార్టీ అధిష్ఠానం స్పష్టతకు రావడానికి నిదర్శనమని టి కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more