ఈ మాటలు వింటుంటే తిమ్మిరి.. తిమ్మిరి... మాజీ గవర్నర్ గుర్తుకు వస్తున్నాడు. నా చర్మం ముడతలు పడిన .. నాలో కోరికలు చావాలేదనే విధంగా ప్రవర్తించిన మాజీ గవర్నర్ ఎన్ డి తివారి గురించి తెలిసిందే. ఆయన ఆ వయసులో అమ్మాయిలతో వేసిన వేలికి చేష్టాలు ఆంద్రప్రదేశ్ ప్రజలు మరిచిపోలేరు. ఇప్పుడు అదే బాటలో ఒక మంత్రి ఎక్కారు. నోరుజారితే వెనక్కి తీసుకోవడం ఎంత కష్టమో కేంద్ర బొగ్గుశాఖ మంత్రి శ్రీప్రకాష్ జైస్వాల్కు తెలిసొచ్చింది. "కొత్త కొత్త పెళ్లికి, కొత్త కొత్త విజయానికి ఉండే మజా వేరు. వాటికి సొంత ప్రాధాన్యం ఉంటుంది. కాలం గడిచే కొద్దీ విజయాలు పాతవైపోతాయి. అలాగే.. కాలం గడిచేకొద్దీ భార్య కూడా పాతదైపోతుంది. ఆమె అందచందాలు ఇక ఏమాత్రం ఉండవు. పెళ్లయ్యి సంవత్సరాలు గడిచేకొద్దీ పాత భార్యలతో సుఖం ఏమీ ఉండదు'' అని ఆయన ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. దీంతో మహిళా సంఘాలతో పాటు ప్రతిపక్షాలు కూడా మంత్రిపై మండిపడ్డాయి. దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తడంతో.. చివరకు మంత్రిగారు యథాప్రకారం తన మాటలను మీడియా వక్రీకరించిందని చెప్పి, ఆ పై క్షమాపణలు కూడా చె ప్పుకొన్నారు.
ఆయన ఒక సమ్మేళనానికి హాజరై ప్రసంగిస్తుండగా.. టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్పై భారత్ గెలిచినట్లు వార్త తెలిసింది. దీంతో సభలో ఉన్నవారంతాహర్షం వ్యక్తం చేయగా, విజయం కొత్తదైతేనే సంబరం ఉంటుందని చెబుతూ.. భార్యలపై వ్యాఖ్యలు చేశారు. దీంతో మహిళా సంఘాల వారు ఆయన స్వస్థలమైన కాన్పూర్లో పోస్టర్ల మీద నల్లరంగు పూసి.. ఆయన దిష్టిబొమ్మలు కూడా దహనం చేశారు. జైస్వాల్ను కేబినెట్లో ఎలా కొనసాగిస్తారని బీజేపీ ప్రశ్నించింది. ఆయన వ్యాఖ్యలు చాలా అవమానకరంగా ఉన్నాయని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ మమతా శర్మ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓ మహిళ నేతృత్వం వహిస్తున్నారని, అయినా ఆమె ఇలాంటి ఫ్యూడల్ భావజాలం ఉన్న వ్యక్తిని మంత్రివర్గంలో కొనసాగించడం ఎంతవరకు సమంజసమని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. ఆ పార్టీ మహిళా విభాగం అధినేత్రి స్మృతి ఇరానీ కూడా మండిపడ్డారు. అయితే, ఇప్పటికే జైస్వాల్ క్షమాపణలు చెప్పారు కాబట్టి ఇక ఆ విషయం ఇంతటితో ముగిసిందని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more
Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more
Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ పరచలేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ పరఫక్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more
Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more
Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more