టర్కీలో సీ-పోర్టులో ఓ భారీ నౌక అందరూ చూస్తుండగా సముద్రంలో మునిగిపోయింది. అయితే అదృష్టవశాత్తు అందులో వచ్చిన అందరూ దిగిపోయిన తరువాత ఈ ప్రమాదం సంభవించింది. భారీ నౌక సముద్రంలో మునిగిపోతున్న తరుణంలో వచ్చిన శబ్దాలతో అందరూ భయకంపితులై దాని నుంచి దూరంగా పారిపోయారు. ఈ ఘటన టర్కీలోని ఇస్కెండరమ్ పోర్టులో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై నెటిజనుల నుంచి మిశ్రమస్పందనలు వస్తున్నాయి.
టర్కీ అధికారుల వివరాల ప్రకారం తమ దేశంలోని ఇస్కెండరమ్ పోర్టుకు ఓ భారీ నౌక చేరుకుంది. ఈ నౌకలో కొందరు ప్రయాణికులతో పాటు పలు కంటైనర్లు కూడా ఉన్నాయి. ఇలా భారీ నౌక పోర్టులోని డాక్ యార్డు వద్దకు చేరుకుంది. వెంటనే నౌకలోని సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా దిగేసారు. ఇక నౌకలోని కంటైనర్లను భారీ క్రేన్ల సాయంతో ఒక్కొక్కటిగా అన్లోడ్ చేస్తున్నారు. ఇంతలో ఏమైందో విజిల్స్ వేసినట్లు శబ్దం వచ్చింది. పడవ పక్కనే ప్లాట్ఫాంపై నిలబడి ఉన్న వాళ్లందరూ ఆ శబ్దం విని అక్కడి నుంచి నౌక నుంచి దూరంగా పారిపోయారు. అసలేం జరుగుతుందోనని అందోళన చెందుతూ దూరంగా వెళ్లి చూస్తున్నారు.
వాళ్లు చూస్తుండగానే నెమ్మదిగా ఒక పక్కకు ఒరిగిన ఆ భారీ నౌక.. సముద్రంలో మునిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘సీ ఈగల్’ అనే పేరున్న ఈ నౌక.. టర్కీలోని ఇస్కెండరమ్ పోర్టుకు వచ్చింది. అక్కడ కంటైనర్లు అన్లోడ్ చేస్తున్న సమయంలో అదుపుతప్పి నీటమునిగింది. నౌకలో బ్యాలెన్స్కు బంధించిన సమస్య ఉందేమో అని కొందరు అనుమానిస్తున్నారు. అయితే పడవలోని సిబ్బంది మాత్రం.. దానిలోని అన్ని పరికరాలు చక్కగా పనిచేస్తున్నాయని, అంతకుముందు వరకూ నౌక బాగానే ఉందని చెప్తున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 24 కంటైనర్లు కనిపించకుండా పోయాయని అధికారులు చెప్పారు.
Sinking moment of the Sea Eagle in İskenderun... pic.twitter.com/mgg3VtKIMl
— focuSEA (@focuseatv) September 19, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more