జమ్మూకశ్మీర్లో భద్రతా దళాలు-ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. జమ్మూకాశ్మీర్ లోని అనంతనాగ్ సెక్టార్ లో పాకి్స్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు నక్కిఉన్నారన్న పక్కా సమాచారంతో కూంబింగ్ చేసిన పోలీసులు ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు. కూంబింగ్ చేస్తున్న పోలీసులపై ముష్కరులు కాల్పులతో వవిరుచుకుపడ్డారు. దీంతో పోలీసులు వెనువెంటనే తేరుకుని ప్రతికాల్పులు జరపడంతో ముష్కరులు ప్రాణాలు వదిలారు. ఈ ఘటన అనంతనాగ్ ప్రాంతంలోని పోష్క్రీరి గ్రామపరిధిలో జరిగింది.
పోష్కరిరీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. ఎలాగైనా వారిని ప్రాణాలతో అదుపులోకి తీసుకోవాలని భావించి కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో భారత భద్రతా బలగాలకు తారసపడిన ఉగ్రవాదులు జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. కాల్పులు ఆగిన అనంతరం ఆ ప్రాంతాన్ని పరిశీలించగా ఇద్దరు ఉగ్రవాదులు హతమై కనిపించారు. వారిని హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన డానిష్ భట్ అలియాస్ కొకబ్ దూరీ, బషరత్ నబీగా గుర్తించారు.
వీరిద్దరూ గతంలో పౌరహత్యలకు పాల్పడినట్టు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 2021లో సలీమ్ అనే భారత సైనికుడి హత్యతోపాటు ఆ తర్వాతి నెలలో జబ్లీపురాలో ఇద్దరు పౌరుల హత్య కేసులో వీరి ప్రమేయం ఉన్నట్టు కాశ్మీర్ జోన్ అదనపు డీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారని.. ఎక్కడైన ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా.? అన్న కోణంలో కార్డన్ సర్చ్ జరిగిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, శ్రీనగర్లోని ఖాన్మోహ్ ప్రాంతంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 35 కిలోల పేలుడు పదార్థాలు లభించాయి. అనంతరం వాటిని పేలకుండా చేసి ధ్వంసం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more