ఆదాయపన్నుశాఖకు చెందిన అధికారులకు ఉండే ప్రత్యేకమైన అధికారాలను కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటూ.. నకిలీ ఐటీ అధికారుల అవతారం ఎత్తుతున్నారు. సూర్య నటించిన గ్యాంగ్ సినిమాలో క్లైమాక్స్ లో కథ మలుపుతిప్పే సీన్ ను కేటుగాళ్లు నిజంగా రిపీట్ చేసినా.. వారి నటనా కౌశల్యంలో చివరి నిమిషంలో అనుమానం వచ్చిన యజమాని అప్రమత్తం కావడంతో.. పట్టుబడిన నకిలీలు చివరకు ఊచలు లెక్కపెడుతున్నారు. ఏకంగా సినిమాలో మాదిరిగానే వీరు కూడా ఓ బంగారు ఆభరణాల దుకాణన్నే టార్గటె్ చేయడం విశేషం.
నెల్లూరు జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని కాకర్లవారి వీధిలో ఉన్న లావణ్య జ్యువెలర్స్లో భారీ చోరీకి స్కెచ్ వేసిన దొంగలు పన్నాగం పారక కటకటాల పాలయ్యారు. సుమారు 6 గురు సభ్యులు గల ముఠా దర్జాగా కారులో వచ్చి తాము ఐటీ అధికారులమంటూ దుకాణంలో చొరబడ్డారు. వచ్చిరావడంతోనే దుకాణంలోని మార్గాలను అన్నింటినీ బ్లాక్ చేసి.. ఫోన్లు కూడా మాట్లాండేందుకు వీలు లేకుండా అచ్చంగా ఒరిజినల్ ఆదాయపన్నుశాఖ అధికారుల మాదిరిగానే చేశారు. దుకాణానికి సంబంధించిన లావాదేవీల పుస్తకాలు చూపించాలని నగల షాపు యజమానిని బెదిరించారు.
యజమాని బంగారం తాలుకు రశీదులను చూపించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. అధికారుల దృష్టి మాత్రం నగలపైనే పడింది. ఎలాగైనా షాపు నుంచి ఆభరణాలను తస్కరించాలని స్కేచ్ లో భాగంగా వారు దుకాణంలో ఉన్న 12 కిలోల బంగారాన్ని మూట కట్టించారు. కానీ యజమాని చూపుతున్న రశీదులను ససేమిరా పట్టించుకోలేదు. అయితే ఈ ప్రవర్తనే యజమానికి అనుమానాలను రేకెత్తించింది. ఐటీ అధికారులు వ్యవహరించే విధంగా కాకుండా భిన్నంగా ఉండడంతో వారిని ఒక గదిలో బంధించి మూడవ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more