కేంద్ర మంత్రి, బీజేపీ నేత అజయ్ మిశ్రా గుర్తున్నాడా.? ఉత్తరాదికి చెందిన కేంద్రమంత్రి. సుమారుగా రెండేళ్ల క్రితం ఢిల్లీ శివార్లలోని టిక్రి, సింఘీ వంటి శివారు ప్రాంతాలనే తమ అవాసాలుగా చేసుకుని ఏకంగా ఏడాది కాలం పాటు రైతులు నూతన సాగు చట్టాలను బేషరుత్తుగా కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏడాది కాలానికి పైగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేసిన విషయం దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. ఈ సమయంలోనే ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తనయుడు అశీశ్ మిశ్రా.. రైతులపై నుంచి తన కారును పోనిచ్చి అమాయక రైతుల మరణాలకు కారణమైన బీజేపి యువనేత.
రెండేళ్లు గడిచిన తరువాత కూడా ఆయనకు రైతులపై సదాభిప్రాయమే లేకుండా పోయింది. తాజాగా కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రైతులను ఉద్దేశించి పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోడ్డు వెంట పోతుంటే కుక్కలు మొరుగుతుంటాయని, తాను వాటిని పట్టించుకోనని వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గం లఖింపూర్ ఖీరీలో జరిగిన కార్యకర్తల సమావేశంలో అజయ్మిశ్రా మాట్లాడిన మాటలు ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బాధిత రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని, కేంద్ర మంత్రి పదవి నుంచి అజయ్ మిశ్రాను తప్పించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు తాజాగా మూడు రోజుల పాటు లఖింపూర్లో మహాధర్నా నిర్వహించాయి.
రైతుల ఆందోళన తర్వాత అజయ్మిశ్రా లఖింపూర్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. ఇక్కడ ఆయన మాట్లాడుతూ ‘నేను కారులో వేగంగా లక్నోకు వెళ్తున్నానని అనుకోండి.. కుక్కలు మొరుగుతాయి. మొరగడంతో పాటు కారు వెంట కూడా పడుతాయి. అది వాటి సహజ స్వభావం. వాటి గురించి నేనేం చెప్పలేను. అటువంటి స్వభావం మనకు లేదు’ అని అన్నారు. అశిష్ మిశ్రా గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రం అజయ్మిశ్రా నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. అయితే మీడియా, రైతులుగా చెప్పుకునే వారు తనకు ఇంత పాపులారిటీ తెచ్చిపెడతారని ఎన్నడూ అనుకోలేదని పేర్కొన్నారు.
వీరితో పాటు కెనడా, పాకిస్థాన్లో కూర్చొన్న జాతీయేతర రాజకీయ పార్టీలు, ఉగ్రవాదులు.. వీరి కారణంగా తాను మంచి పాపులారిటీ ఆర్జించానని తెలిపారు. ఇంత పాపులర్ చేస్తారనివలన ప్రజలు తనను ఎలా ఓడించాలో ఎన్నటికీ తెలుసుకోలేరని ఎగతాళి చేశారు. ఏనుగు తన దారిన తాను వెళ్తుందని, కుక్కలే ఎప్పుడూ మొరుగుతుంటాయని వ్యంగ్యంగా మాట్లాడారు. రైతు నేత రాకేశ్ టికాయిత్ను కూడా టార్గెట్గా చేసుకొని అజయ్ మిశ్రా పలు వ్యాఖ్యలు చేశారు. ‘ఎంతమంది రాకేశ్ టికాయిత్లు వచ్చినా మనల్ని ఏం చేయలేరు. అతనో చౌకబారు మనిషి. రెండుసార్లు ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన వ్యక్తి’ అన్నారు. కాగా, లఖింపూర్లో గూండారాజ్యం నడుస్తున్నదని టికాయిత్ మండిపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more