సముద్రపు బీచ్లో ఎంజాయ్ చేస్తున్న సందర్శకులు.. కొందరు సముద్రంలో దిగి స్నానాలు చేస్తూ అహ్వాదాన్ని అస్వాదిస్తుండగా, మరికొందరు సముద్రపు ఒడ్డున ఇసుక తెన్నరపై సన్ బాత్ చేస్తూ సేద తీరుతున్నారు. అలా రిలాక్స్ అవుతున్న తరుణంలో పర్యాటకులను తరుముతూ రెండు సముద్ర సింహాలు అక్కడికి వస్తే.. ఎలా ఉంటుంది. అదే జరిగింది. సముద్ర తీరంలో బీచ్ లోని పర్యాటకులను సముద్ర సింహాలు అక్కడి నుంచి తరిమాయి. సముద్ర సింహాలను చూసిన పర్యాటకులు అవి ఎక్కడ తమపై దాడి చేస్తాయోనని పరుగులు తీశారు.
అమెరికాలోని శాన్ డియాగోలో ఈ సంఘటన జరిగింది. లా జోల్లా ప్రాంతంలోని బీచ్ వారాంతంలో సందర్శకులతో కిటకిటలాడింది. కొందరు సముద్రంలో జలకాలాడుతూ, కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేయగా, మరికొందరు బీచ్లోని ఇసుకలో సేద తీరారు. కాగా, ఆ బీచ్ తీరంలో రెండు సముద్ర సింహాలు నిద్ర పోతున్నాయి. ఒక మహిళ ఫొటోలు తీసేందుకు వాటికి మరింత దగ్గరగా వెళ్లింది. దీంతో మేల్కొన్న ఆ సముద్ర సింహాలు ఆ మహిళతోపాటు బీచ్లో ఉన్న సందర్శకుల వెంటపడి తరిమాయి. బెదిరిపోయిన బీచ్లోని వారు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.
మరోవైపు బీచ్ వద్ద ఉన్న రక్షకులు వెంటనే స్పందించారు. సముద్ర సింహాల బారినపడి ఎవరూ గాయపడకుండా చూశారు. అవి తిరిగి సముద్రంలోకి వెళ్లేలా చేశారు. కాగా, ఆ సమయంలో అక్కడ ఉన్న పర్యాటకురాలు చార్లియన్నే యేనా తన మొబైల్ ఫోన్లో ఈ వీడియో తీశారు. దీనిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. అయితే సముద్ర సింహాలు వెంబడిస్తుండగా టూరిస్టులు భయంతో పరుగులు తీస్తుండటాన్ని చూడటం తనకు వింతగా అనిపించిందని, అందుకే వీడియోను రికార్డు చేసినట్లు స్థానిక మీడియా సంస్థకు ఆమె వెల్లడించింది.
The sea lions at La Jolla Cove San Diego have had enough of the tourists.pic.twitter.com/N1UgY4Ez78
— Anthea (@Anthea06274890) July 10, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more