మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని అధికార మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనుంది. అసెంబ్లీలో ఠాక్రే సర్కారు తమ మెజార్టీని నిరూపించుకోవాలని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆదేశించారు. ఇందుకోసం రేపు(జూన్ 30) ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించారు.
రాష్ట్రంలోని మహా వికాస్ అఘాడి సర్కారుకు తగు సంఖ్యాబలం లేదని నిన్న రాత్రి... బీజేపి ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్ కు వినతిపత్రం సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నావిస్ నేతృత్వంలోని బీజేపి ఎమ్మెల్యేలు గవర్నర్ కలసి.. శివసేనకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారని, సర్కారు మైనారిటీలో పడిందని ఆయనకు వినతపత్రాన్ని సమర్పించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్.. బలాన్ని నిరూపించుకోవాలని ఠాక్రే సర్కారును ఆదేశించారు. ఈ మేరకు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత గవర్నర్ ఈ ఆదేశాలు జారీ చేశారు.
గురువారం ఉదయం 11 గంటలకు ఈ విశ్వాస పరీక్ష జరిపించాలని.. ఈ మొత్తం ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం 5 గంటల్లోగా పూర్తిచేయాలని గవర్నర్ సూచించారు. దీన్ని రికార్డ్ చేయాలని ఆదేశించారు. కాగా, ఇదివరకే శివసేన రెబల్ ఎమ్మెల్యేలపై వేసిన వేటును దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. జూలై 11 వరకు వారిపై వేటు వేసేందుకు అవకాశం లేదని చెప్పిన నేపథ్యంలో.. ఆ ఉత్తర్వులతో పాటు గవర్నర్ అదేశాలపై శివసేన దేశఅత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇదిలా ఉండగా, శివసేన అగ్రనేత సంజయ్ రౌత్ గవర్నర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
గత రెండు సంవత్సరాలుగా తమ ప్రభుత్వం పంపిన ఫైల్స్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నాయని.. అయితే వాటిపై ఇప్పటివరకు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. కానీ ప్రస్తుత పరిణామాలపై ఆయన జెట్ వేగంతో దూసుకెళ్తున్నారని విమర్శలు చేశారు. రఫేల్ జెట్ కూడా ఇంత వేగంగా ఉండదు. అంతకన్నా వేగంగా గవర్నర్ పనిచేస్తున్నారని.. భారత రాజ్యాంగంతో గవర్నర్ ఆటలాడుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఆదేశాలు చట్టవిరుద్ధం. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు ఇంకా తీర్పు వెలువరించని తరుణంలో తాజా చర్య చట్టవిరుద్ధం’ అంటూ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more