ఒక్కసారి మనకే ఎవరిపైనైనా కోపం వచ్చిందంటే చాలు.. వారిని ఏమీ చేయలేక.. మనం ఏం చేసినా.. గమ్మున ఇళ్ల ముందే పడుండే వీధి కుక్కలపై ఆ కోపాన్ని ప్రదర్శిస్తాం. అయితే అవి.. మనం పెట్టే కొంచం అన్నం తిని ఎంత విశ్వాసంగా ఉంటాయో ఇప్పటికే అనేక వీడియోల ద్వారా మనం చూశాం. ఒక సందర్భంగా పులులను కూడా ఎదురించిన శునకాలు.. యజమానుల కోసం తమ ప్రాణాలను సైతం ఇట్టే త్యాగం చేస్తాయి. అయినా చివరి వరకు యజమాని క్షేమం కోసమే తలపిస్తాయి తప్ప.. తమ ప్రాణం అంటూ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవు.
ఇలాంటి విశ్వాసం మరే జంతువులోనూ కనిపించదు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని అటవీప్రాంతానికి సమీపంలో వున్న ఓ ప్రాంతంలోకి అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి వచ్చింది. దీంతో వర్షాలు పడటంతో పోలం పనులపై ఉదయాన్నే చేన్లకు వెళ్లిన రైతులు ఎలుగుబంటిని చూసి గ్రామంలోకి పరుగులు తీశారు. అయితే వారికి అండగా అదే ప్రాంతానికి వచ్చిన వీధి కుక్కలు మాత్రం.. ఎలుగుబంటిని తమ గ్రాప పోలిమేరలు దాటేవరకు తరిమేశాయి. ఔనా.. అని అంటున్నారా.. ఇది ముమ్మాటికీ నిజం. అదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతర్గావ్ శివారులో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది.
వానాకాలం పంట వేయడానికి తెల్లవారుజామునే రైతులు, కూలీలు పొలాలకు చేరారు. ఈ క్రమంలో పంటచేల పరిసరాల్లో ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఎలుగుబంటి ఒక్కసారిగా పొలాల్లో ప్రత్యక్షమైంది. ఎలుగును చూసి రైతులు, కూలీలు పరుగులంకించారు. గ్రామంలోకి పరుగు తీసి గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రామస్థులంతా కలిసి ఎలుగుబంటి సంచరించే ప్రాంతానికి శునకాలతో వెళ్లారు. అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్న ఎలుగుబంటిని శునకాల సాయంతో తరిమికొట్టారు. ఈ దృశ్యాలను వీడియో తీసిన పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఎలుగుబంటి నుంచి తమకు రక్షణ కల్పించాలని గ్రామస్థులు అటవీ శాఖ అధికారులను కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more