ఒక్కసారి మనకే ఎవరిపైనైనా కోపం వచ్చిందంటే చాలు.. వారిని ఏమీ చేయలేక.. మనం ఏం చేసినా.. గమ్మున ఇళ్ల ముందే పడుండే వీధి కుక్కలపై ఆ కోపాన్ని ప్రదర్శిస్తాం. అయితే అవి.. మనం పెట్టే కొంచం అన్నం తిని ఎంత విశ్వాసంగా ఉంటాయో ఇప్పటికే అనేక వీడియోల ద్వారా మనం చూశాం. ఒక సందర్భంగా పులులను కూడా ఎదురించిన శునకాలు.. యజమానుల కోసం తమ ప్రాణాలను సైతం ఇట్టే త్యాగం చేస్తాయి. అయినా చివరి వరకు యజమాని క్షేమం కోసమే తలపిస్తాయి తప్ప.. తమ ప్రాణం అంటూ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవు.
ఇలాంటి విశ్వాసం మరే జంతువులోనూ కనిపించదు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని అటవీప్రాంతానికి సమీపంలో వున్న ఓ ప్రాంతంలోకి అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి వచ్చింది. దీంతో వర్షాలు పడటంతో పోలం పనులపై ఉదయాన్నే చేన్లకు వెళ్లిన రైతులు ఎలుగుబంటిని చూసి గ్రామంలోకి పరుగులు తీశారు. అయితే వారికి అండగా అదే ప్రాంతానికి వచ్చిన వీధి కుక్కలు మాత్రం.. ఎలుగుబంటిని తమ గ్రాప పోలిమేరలు దాటేవరకు తరిమేశాయి. ఔనా.. అని అంటున్నారా.. ఇది ముమ్మాటికీ నిజం. అదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అంతర్గావ్ శివారులో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది.
వానాకాలం పంట వేయడానికి తెల్లవారుజామునే రైతులు, కూలీలు పొలాలకు చేరారు. ఈ క్రమంలో పంటచేల పరిసరాల్లో ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఎలుగుబంటి ఒక్కసారిగా పొలాల్లో ప్రత్యక్షమైంది. ఎలుగును చూసి రైతులు, కూలీలు పరుగులంకించారు. గ్రామంలోకి పరుగు తీసి గ్రామస్థులకు సమాచారం అందించారు. గ్రామస్థులంతా కలిసి ఎలుగుబంటి సంచరించే ప్రాంతానికి శునకాలతో వెళ్లారు. అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్న ఎలుగుబంటిని శునకాల సాయంతో తరిమికొట్టారు. ఈ దృశ్యాలను వీడియో తీసిన పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఎలుగుబంటి నుంచి తమకు రక్షణ కల్పించాలని గ్రామస్థులు అటవీ శాఖ అధికారులను కోరారు.
(And get your daily news straight to your inbox)
Jun 30 | మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల నాయకుడు ఏక్నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయగా, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ రాత్రి... Read more
Jun 30 | రైలు టికెట్ కొనాలంటే ముందుగా కౌంటర్ వద్దకు వెళ్లేందుకు ప్రయాణీకులు ఎంతో సమయం క్యూల్లో నిలబడిఉండాలి. టికెట్లు ఇచ్చే వ్యక్తిపైనా తరచూ ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు పలు... Read more
Jun 30 | గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభానికి ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న శివసేన రెబల్ వర్గ ఎమ్మెల్యేలు బీజేపితో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రంగం సిద్దమైంది. అయితే... Read more
Jun 30 | బంగారం అంటే మహిళలకు చాలా ఇష్టం. దీని కోసమే ఎన్నో ఇళ్లలో మగవారు చీవాట్లు తింటారు. ఇంకొన్ని ఇళ్లలో ప్రశంసలను అందుకునే వాళ్లూ ఉన్నారు. మరి ఈ కుందనం నలుపు శరీర ఛాయ ఉన్నవారిపై... Read more
Jun 30 | గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మహారాష్ట్ర సంక్షోభం శివసేన అధినేత, మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ ఎనమిది మంది మంత్రులపై విధించిన... Read more