అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ కాల్పుల శరామామూలుగా మారుతున్నాయా.? అగ్రరాజ్య పరిపాలకులు ఈ కాల్పులపై తమ సానుభూతిని వ్యక్తం చేయడం తప్పితే.. దేశంలో కాల్పులు శబ్దాలు వినపించకుండా చర్యలు తీసుకోలేరా.? అంటే పాలకులే సమాధానాలు చెప్పాల్సివుంటుంది. వరుసగా వినిపిస్తున్న తుపాకీ కాల్పుల శబ్దాలలో అమాయక అగ్రరాజ్యవాసులే మృత్యువాత పడుతున్నారు. ఇక దేశపురోగాభివృద్దిలో తమ వంతు పాత్రను పోషిస్తున్న ఎందరో పౌరులు గాయాలపాలవుతున్నారు. కొందరు అంగవైకల్యం బారినపడుతున్నారు. ఈ సంస్కృతి కారణంగా ఎందరో చిన్నారులు.. తాము కన్న కలల్ని సాకరం చేసుకోకుండానే అగంతకుల తుపాకీ తూటాల అడ్డుకుంటున్నాయి.
అగ్రరాజ్యంలోని టెక్సాస్ నగరం, ఉవాల్డేలోని ఎలిమెంటరీ పాఠశాలలో 18 ఏళ్ల యువకుడు తుపాకీతో పాఠశాలలోని తరగతి గదిలోకి ప్రవేశించి.. 19 మంది విద్యార్థులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులను కాల్చిచంపిన విషాదం ఘటన నుంచి అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు సంభవిస్తున్నాయి. అగ్రరాజ్యంలో తుపాకీ పేలుళ్ల వరుస ఘటనలు చోటుచేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఎలిమెంటరీ స్కూల్ కాల్పుల ఘటన తరువాత ఏకంగా అగ్రరాజ్యంలో ఇప్పటివరకు వరుసగా ఆరు ఘటనలు జరిగినట్లు సమాచారం.
ఇక తాజాగా చికాగోలో కాల్పులమోత దద్దరిల్లింది. మేరీల్యాండ్ లోని స్మిత్ బర్డ్ ఘటన విషాదాన్ని మరువకముందే చికాగోలోని ఇండియానా నైట్క్లబ్లో అగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో దుండగుడి కాల్పులకు ఇద్దరు ఘటనాస్థలంలోనే మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డాగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో చికాగోలో వారం రోజుల వ్యవధిలో తుపాకీకి ఆరుగురు బలయ్యారు. కాల్పులు జరిపిన అనంతరం దుండగుడు ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు.
కాగా అగంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని అగ్రరాజ్యంలోని చికాడో పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితం.. పశ్చిమ మేరీల్యాండ్లోని స్మిత్బర్గ్లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. కొలంబియా మెషీన్ అనే కంపెనీలోకి చొరబడ్డ ఓ సాయుధుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అయితే భద్రతాసిబ్బంది జరిపిన ఎదురు కాల్పుల్లో దుండగుడితో పాటు ఓ పోలీసు గాయపడ్డాడు. ఈవిధంగా అగ్రరాజ్య యువతలో నేరప్రవృత్తి పెరుగుతన్నా ఇంకా ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తూ కూర్చుంటే.. అగ్రరాజ్యానికి తీరని నష్టం వాటిల్లే ప్రమాదం పోంచివుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more