మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఔరంగజేబు సమాధిని సందర్శించి.. ఆక్కడ నమాజు చేయడంతో అగ్గికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. దీంతో అక్బరుద్దీన్ పై అటు బీజేపి ఇటు ఎంఎన్ఎస్ ఒంటికాలుపై లేచాయి. మరోవైపు అధికార శివసేన పార్టీ కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో మరోఅడుగు ముందుకేసిన మహారాష్ట్ర నవ నిర్మాణసేన (ఎంఎన్ఎస్) రాష్ట్రంలో అలుముకుంటున్న వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. మహారాష్ట్రలో ఔరంగజేబ్ సమాధి ఉండాల్సిన అవసరం ఏముందని ఎంఎన్ఎస్ అధికార ప్రతినిధి గజానన్ కాలే ట్వీట్ మహారాష్ట్రలో అగ్గిరాజేసింది. అంతటితో ఆగని ఆయన రాష్ట్రంలోని ఔరంగజేబ్ సమాధిని ధ్వంసం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా ఖుల్తాబాద్ ప్రాంతంలో ఉన్న ఔరంగజేబు సమాధిని సమాధిని భారత పురావస్తు శాఖ అధికారులు మూసివేశారు.
ఈ నేపథ్యంలో సమాధి ఉన్న ప్రాంతంలోని మసీదు కమిటీ దానికి తాళం వేయడానికి ప్రయత్నించగా.. ఆర్కియాలజీ శాఖ ఆ చర్యను అడ్డుకుని సమాధి ప్రాంతాన్ని మూసివేసింది. ఐదు రోజులపాటు సమాధిని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు సమాధి వద్ద భద్రతను పెంచి కట్టుదిట్టం చేశారు. ఈ అంశంపై పురావస్తు శాఖ ఔరంగాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ మిలన్ కుమార్ చౌలే మాట్లాడుతూ... మసీదు కమిటీ ఆ ప్రాంతాన్ని లాక్ చేయడానికి ప్రయత్నించిందని... తాము దాన్ని తెరిపించామని చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో, ఐదు రోజుల పాటు సమాధిని మూసి వేయాలని నిన్న నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఐదు రోజుల తర్వాత పరిస్థితిని బట్టి సమాధి ప్రాంతాన్ని తెరవాలా? లేక మరో ఐదు రోజుల పాటు మూసివేయాలా? అనే నిర్ణయాన్ని తీసుకుంటామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Jun 29 | హర్యానాకు చెందిన 70 ఏళ్ల బామ్మ చేసిన విన్యాసం.. నెట్టింట్లో వైరల్ గా మారింది. 70 ఏళ్ల వయస్సులోనూ అమెలో ఉత్సాహం, ఉల్లాసం ఏమాత్రం తగ్గలేదని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. నేటి యువతకు అమె... Read more
Jun 29 | అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితుల వేళ డాలరతో పోల్చుకుంటే రూపాయి విలువ భారీగా పతనమవుతోంది. దేశంలో ఇంధన ధరలు కూడా పలు వస్తువులపై ధరల ప్రభావాన్ని చూపుతుండగా, అటు ద్రవ్యోల్భనం కూడా దశ అర్థిక స్థితిగతులపై... Read more
Jun 29 | రాజస్థాన్ ఉదయ్పూర్లో హిందూ టైలర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపి మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతుగా సామాజిక మాద్యమాల్లో కన్నయ్య లాల్ అనే దర్జీని పెట్టిన పోస్టును ఖండిస్తూ.. ఆయన... Read more
Jun 29 | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని.. అధికార దాహంతో తెర వెనుకనుండి రెబల్స్ ను ఆడిస్తోందని బీజేపియేనని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఈ ఉత్కంఠకర ఎపిసోడ్ క్లైమాక్స్ కు చేరుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన... Read more
Jun 29 | కరోనా మహమ్మారి తరువాత ఆహార పదార్థాలకు రెక్కలు వచ్చాయని.. తమ పరిస్థితి మూలిగే నక్కలా తయారైందని సామాన్యులు బాధపడుతున్న తరుణంలో కేంద్ర ఇచ్చిన షాక్ తో వారిపై తాటికాయపడినట్లైంది. ఆహార పదార్థాల ధరలు మరింత... Read more