Sarkaru Vaari Paata: Telangana Govt permits to hike tickets price ‘సర్కారువారి పాట’ అదనపు షోలకు సర్కారు పచ్చజెండా

Sarkaru vaari paata mahesh babu movie granted permission to hike prices

Sarkaru Vaari Paata, Sarkaru Vaari Paata trailer, mahesh babu, Sarkaru Vaari Paata movie, Keerthy Suresh, Sarkaru Vaari Paata movie trailer, Sarkaru Vaari Paata release date, Sarkaru Vaari Paata, official trailer, Mahesh babu, Keerthy suresh, parasuram, Thaman, Mythri Movie Makers, 14 Reels Plus, Tollywood, Movies, Entertainment

The Telangana government had issued permission to the exhibitors to collect additional charges for the Mahesh Babu’s “Sarkaru Vaari Paata” in the Nizam Area, The govt also issued a special show permission to the exhibitors for a week, i.e, up to 18th May.

‘సర్కారువారి పాట’ అధనపు షోలకు సర్కారు పచ్చజెండా

Posted: 05/09/2022 08:41 PM IST
Sarkaru vaari paata mahesh babu movie granted permission to hike prices

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రంలో ఆయన లవర్‌ బోయ్‌గా కనిపిస్తూనే కామెడీ టైమింగ్‌, పంచ్ డైలాగులతో నిండిన ట్రైలర్ అద్భుతంగా ఉంది. ట్రైలర్‌ మధ్యలో మహేష్‌ శ్రీకాకుళం యాసలో చెప్పిన డైలాగులు ఫన్నీగా ఉన్నాయి. కీర్తి సురేశ్‌ చాలా అందంగా కనిపిస్తోంది. బ్యాంక్‌ స్కామ్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో మహేష్‌ అభిమానులకు కావాల్సిన యాక్షన్‌, కామెడీ, రొమాన్స్‌లను చేర్చినట్లుగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో అభిమానుల్లో చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి.

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మే 12న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం సినిమా టికెట్‌ధ‌ర‌ల‌ను పెంచుకునేందుకు అనుమ‌తిచ్చింది. దీంతో పాటుగా అదనపు ఆటను వేసుకునేందుకు కూడా అనుమ‌తి కూడా ఇచ్చింది. 5వ షో వేసుకునేందుకు మే 12 నుంచి 18 వ‌ర‌కు అవ‌కాశం ఇచ్చింది. వారం రోజుల పాటు ఈ చిత్రం మ‌ల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ థియేట‌ర్ల‌లో రూ.50 పెంచుకునేందుకు అనుమ‌తివ్వ‌గా.. ఏసీ సాధార‌ణ థియేట‌ర్‌లో రూ.30 పెంచుకునే అవ‌కాశం క‌ల్పించింది. ఇక అటు ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ చిత్రం టికెట్ ధరలను పెంచుకునేందుకు చిత్రబృందం అనుమతి కోరింది.

మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేనీ, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంతోని ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ చిత్రం తర్వాత మహేష్‌.. త్రివిక్రమ్ డైరక్షన్‌లో ఓ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇది కాకుండా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళితోనూ ఓ చిత్రం చేయబోతున్నారు మహేశ్. ఈ సినిమా కోసం సూపర్ స్టార్‌తో పాటు అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా కూడా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles