ఏప్రిల్ మాసంలో ప్రపంచభానుడు చండ్ర నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి భగభగల ధాటికి ఎండలోకి వెళ్లాలంటేనే ఠారెత్తుతోంది. తెలుగు రాస్ట్రాలపై భానుడు కూడా తన ప్రతాపాన్ని చూపుతున్నాడా.. అన్నట్లే ఏకంగా 45.7డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో భారత వాతారణకేంద్రం అలెర్ట్ జారీ చేసింది. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ, రేపు తెలంగాణలో భానుడు నిప్పుల కొలిమిని తలపింపజేస్తాడని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
రాష్ట్ర ప్రజలు ఎండల వేడిమి నుంచి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరీ ముఖ్యమంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలల్లో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనద్లో అత్యధికంగా 45.7 డిగ్రీలు, జగిత్యాల జిల్లా ఐలాపూర్లో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇవే కావడం గమనార్హం. అలాగే, మరో పది జిల్లాల్లోనూ సూర్యుడు తన ప్రతాపాన్ని చూపాడు. ఆయా జిల్లాల్లో గరిష్ఠంగా 44.8 నుంచి 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
కాగా, భానుడి ప్రతాపం నేడు, రేపు కూడా కొనసాగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని సూచించిన వాతావరణశాఖ.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఆయాజిల్లాల అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్లలోంచి ఇంట్లోని ఏసీలు ఎంత కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెట్టినా.. కరెంటు దండగే కానీ.. కనీసం చల్లగాలి రావడం లేదంటే ఎండలు ఎంత తీవ్రంగా వున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వేసవి మరో నెల రోజులు పాటు కొనసాగునున్న నేపథ్యంలో పరిస్థితులు ఎలా మారుతాయోనని తెలుగు రాష్ట్రాల ప్రజలు అందోళన చెందుతున్నారు.
రోజు రోజుకూ పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల నమోదుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండల తీవ్రత అధికంగా ఉన్నక్రమంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. ఎక్కువ మోతాదులో మంచినీళ్లను తీసుకోవాలని.. గొడుగులను వాడటం మంచిదని సలహా ఇస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more