ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించి వారికి జనసేన తరపున ఆర్ధిక సాయం అందించే రైతు భరోసా కార్యక్రమాన్ని ఈ శనివారం పశ్చిమగోదావరి జిల్లాలో చేపట్టింది జనసేన పార్టీ. ఇందుకోసం హైదరాబాద్ నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. గన్నవరం నుంచి రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరి జిల్లా యాత్రకు బయలుదేరారు. పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దుల్లో పవన్ కల్యాణ్ కు జనసైనికులతో పాటు స్థానిక కార్యకర్తలు, అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది.
పవన్ కల్యాణ్ తమ జిల్లాకు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూసిన అభిమానులకు ఆశలు నెరవేరడంతో వారు క్రేస్ సాయంతో ఆయన వస్తున్న కారుపై భారీ గజమాలను వేసి సత్కరించారు అభిమానులు. కలపర్రు మీదుగా తొలుత పెదవేగి మండలం జానంపేటలో రైతు కుటుంబానికి పవన్ కళ్యాణ్ లక్ష రూపాయల చెక్కు అందించారు. పశ్చిమ గోదావరి యాత్రలో పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్రలో భాగంగా 41 మందికి సహాయం అందించనున్నారు. జనసేన పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర కోసం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అడుగుపెట్టిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు ఆ పార్టీ నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
ఏలూరు శివారులో ఉన్న కలపర్రు టోల్ గేట్ వద్దకు వేల సంఖ్యలో జనసైనికులు తరలి వచ్చారు. పశ్చిమ గోదావరి యాత్రకు వచ్చిన పవన్ను భారీ గజమాలతో సత్కరించారు. కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ జానంపేట వైపు కదిలారు. జానంపేటలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు మల్లికార్జున రావు కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. దెందులూరు నియోజకవర్గం జానంపేట గ్రామంలో తొలి చెక్కు అందచేశారు. బాధిత కుటుంబానికి లక్షరుపాయల సాయంతోపాటు ఇద్దరు ఆడ బిడ్డల భవిష్యత్తుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్తో పాటు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత ధర్మాజీగూడెంలో కౌలు రైతు దాసరి రాజారావు కుటుంబానికి పవన్ కళ్యాణ్ లక్ష రుపాయల ఆర్ధిక సాయం అందించారు. చింతలపూడి నియోజకవర్గం ధర్మాజీగూడెం ప్రాంతానికి చెందిన కౌలు రైతు రాజారావు ఆర్థిక ఇబ్బందులతో మూడేళ్ల క్రితం బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసి అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నారు. జనసేన తరపున ఆ కుటుంబానికి సాయం అందించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more