ది ఫెలిసిటీ ఏస్ అనే భారీ రవాణా నౌక అగ్ని ప్రమాదానికి గురైంది. పనామాకు చెందిన ఈ నౌకలో అత్యంత విలాసవంతమైన, ఖరీదైన కార్లను ఇతర దేశాలకు తరలించేందుకు వస్తుండగా ప్రమాదం సంభవించింది. దీంతో లగ్జరీ కార్లన్నీ సముద్రంలో అగ్నిప్రమాదం దాటికి కాలిబూడిదయ్యాయి. అగ్నిప్రమాదం సంభవించడంతో నౌకలోని సిబ్బంది అంతా తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని సముద్రంలోకి దూకారు. ఈ ఓడలో లాంబోర్ఘిని, పోర్షే, ఆడి, ఫోక్స్ వాగన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల కార్లు ఉన్నాయి. ఈ ఓడ అట్లాంటిక్ మహాసముద్రంలో అజోరెస్ దీవుల వద్దకు వచ్చేసరికి అగ్నిప్రమాదానికి గురైంది.
సమీపంలోనే ఉన్న పోర్చుగీస్ నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఈ నౌకకు సంబంధించిన సమాచారాన్ని అందుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ది ఫెలిసిటీ ఏస్ ఓడలోని 22 మంది సిబ్బందిని సురక్షితంగా తరలించారు. అజోరెస్ దీవుల్లోని ఓ హోటల్ లో వారికి ఆశ్రయం ఏర్పాటు చేశారు. అయితే, కోట్లాది రూపాయల ఖరీదైన కార్లతో కూడిన ఆ ఓడ ఇప్పుడు నడిసముద్రంలో కొట్టుకుపోతోంది. ఆ నౌకలో ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. కాగా, ఈ ఓడలో ఒక్క ఫోక్స్ వాగన్ కంపెనీకి చెందినవే 3,965 కార్లు ఉన్నాయట. దాంతో జర్మనీలోని ఆ సంస్థ యాజమాన్యం తీవ్ర ఆందోళనకు గురవుతోంది.
ఈ కార్గో ఓడ ప్రపంచవ్యాప్తంగా పలు రేవు పట్టణాలకు కార్లను చేర్చాల్సి ఉంది. లగ్జరీ కార్ల తయారీకి పెట్టిందిపేరైన పోర్షే సంస్థ కూడా ఈ పరిణామం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పోర్షే కంపెనీ కార్లు ఈ ఓడలో 1,100 ఉండడమే అందుకు కారణం. 2019లో గ్రాండే అమెరికా అనే నౌక కూడా ఇలాగే 2 వేల లగ్జరీ కార్లతో వెళుతూ సముద్రంలో మునిగిపోయింది. కాగా, ది ఫెలిసిటీ ఏస్ నౌక యజమాని ఈ ప్రమాదంపై వెంటనే అప్రమత్తమయ్యారు. మరో నౌక సాయంతో తమ నౌకను సురక్షితంగా తీరానికి చేర్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more