పండుగ వేళ సామాన్యుడిపై మరో పిడుగు పడింది. కరోనా కష్టకాలంలో అసలే మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్న తరుణంలో నిత్యావసర సరుకుల దరలను పెంచుతూ ఆయా కంపెనీలు నిర్ణయం తీసుకోవడంతో వారిపై మరో భారం పడింది. నిత్యావసర వస్తువులు ధరల పెరుగుదల ప్రధానంగా మధ్యతరగతి వారిపైనే అధిక ప్రభావం చూపునుంది. కాగా, ధరల పెంపు అనివార్యమైందని మరీ ముఖ్యంగా ముడి పదార్థాల ధరలు పెరగడంతో ధరలను పెంచక తప్పలేదని దేశంలోని ప్రముఖ నిత్యావసర సరుకుల కంపెనీలు ఇప్పటికే తెలిపాయి. ఇక నిత్యావసర సరుకుల తయారీ దిగ్గజ సంస్థ హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్యుఎల్) తమ సబ్బులు, డిటర్జెంట్లయిన వీల్, రిన్, సర్ఫ్ ఎక్సెల్, లైఫ్ బోయ్ ధరలను 3 నుంచి 20 శాతం వరకు పెంచింది.
గత ఏడాది నవంబర్ లో కూడా తమ నిత్యావసర వస్తువుల ఉత్పాదనల ధరలను పెంచిన ఈ సంస్థ మరోమారు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ సారి సర్ఫ్ ఎక్సెల్ బార్ ధర 20 శాతం పెంచింది. దీంతో సర్ఫ్ ఎక్సెల్ బార్ ధర రూ.10 నుంచి రూ.12కు పెరిగింది. అలాగే, లైఫ్ బోయ్ 125 గ్రాముల ప్యాక్ ధర రూ.29 నుంచి రూ.31కు, పియర్స్ 125 గ్రాముల సబ్బు ధర రూ.76 నుంచి రూ.83కు ఎగబాకింది. సింగిల్ రిన్ 250 గ్రాముల బార్ ధర రూ.18 నుంచి రూ.19కు పెరిగింది. వీల్ డిటర్జెంట్ పౌడర్ అర కిలో ప్యాక్ ధర రూ.30 నుంచి రూ.31కి పెంచింది. హిందుస్థాన్ యూనిలీవర్ తో పాటు పలు కంపెనీలు పలు నిత్యావసర వస్తువుల ధరలను పెంచాయి.
ప్యాకేజ్డ్ గోధుమ పిండి ధరలను 5-8 శాతం పెంచుతున్నట్లు అదానీ విల్మార్ ఇప్పటికే ప్రకటించింది. అలాగే, బాస్మతి బియ్యం ధరలను 8-10 శాతం పెంచింది. మరోవైపు, పార్లే ప్రొడక్ట్స్ ఈ ఏడాది మార్చి నెలలో 4-5 శాతం ధరలను పెంచాలని యోచిస్తోంది. గత త్రైమాసికంలోనూ ఆ కంపెనీ ధరలు పెరిగాయి. డాబర్ ఇండియా కంపెనీ ధరలు కూడా పెరగనున్నాయి. కావింకేర్ ఈ నెలలో తన షాంపూలు, చర్మ సంరక్షణ ఉత్పత్తుల ధరలు 2-3 శాతం వరకు పెంచనుంది. ఇక ఈ బాటలోనే మరిన్ని నిత్యావసర సరుకుల తయారీ కంపెనీలు కూడా త్వరలో నడవనున్నాయి. ఇక ఒకటి తరువాత మరోకటి అన్ని కంపెనీలు ధరలను పెంచనున్నాయి.
గతేడాది 12 నెలలు కాలంగా, వంట నూనె, పప్పుధాన్యాలు, మసాలా దినుసులు, సంరక్షించదగిన కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులతో పాటు వ్యవసాయ-వస్తువుల వ్యయాలు అధికంగా పెరిగాయి. హిందూస్తాన్ యునిలివర్, ఐటీసీ, నెస్లే, అదే విల్మార్, దబూర్, మైనో, ఇమామి సహా అన్ని ప్రముఖ కంపెనీలపై అదనపు భారం పడుతోంది. చాలా వస్తువుల వ్యయంభార పడటంతో పాటు లాజిస్టిక్స్ ప్యాకేజింగ్ పదార్థాల వ్యయం కూడా పెరిగిందని.. దీంతో నిత్యావసర సరుకుల ధరలను పెంచక తప్పడేం లేదని తెలిపాయి. దీంతో వ్యక్తిగత అవసరాలకు వినియోగించే డిటర్జెంట్ సబ్బులతో పాటు టూత్ ఫేస్ట్ వరకు అన్ని ప్యాకడ్ ఫుడ్ వస్తువులైన రుచికరమైన స్నాక్స్, బ్రేడ్, పాల ఉత్పత్తులు ఇక ప్రియంగా మారనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more