కరోనా కొత్త రకం ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా లేదని, అయితే ఇది శరవేగంగా వ్యాప్తి చెందడంతో అసుపత్రుల పాలయ్యేవారి సంఖ్య పెరగడంతో ఇబ్బందులు ఏర్పడి, సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెప్పారు. దీంతో పెద్దగా ప్రాణహాని చేయడం లేదన్న భావన పెరిగిపోయి.. దేశ ప్రజల్లో నిర్లక్ష్యం అవహరించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలను బలితీసుకున్నా.. ప్రజల్లో మాత్రం ప్రభావం లేదన్న భావన తొలగిపోవడం లేదు. గత రెండు వేరియంట్లతో పోలిస్తే దీని ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ, ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలంగాణ వైద్యులు అంటున్నారు.
మరోవైపు డెల్టా వేరియంట్ ఇంకా వ్యాప్తిలోనే ఉంది. నిర్లక్ష్యానికి చోటు లేకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక కరోనా రెండు విడతలతో పోలిస్తే ఆసుపత్రిలో చేరాల్సిన కేసుల సంఖ్య ఇప్పటి వరకు తక్కువగానే ఉంటోంది. కానీ, గత వారంలో ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్టు వైద్యులు చెబుతున్నారు. గత వారం రోజువారీ 278 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స కోసం చేరారు. కానీ, అంతకు ముందు వారంలో చేరిన కేసుల సంఖ్య 3-4గానే ఉంది. ప్రస్తుతానికి ఆసుపత్రుల్లో బాధితుల సంఖ్య తక్కువగానే కనిపిస్తున్నా.. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే రకం కావడంతో ఎక్కువ మందికి సోకే అవకాశం వుంది.
తద్వారా ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య గత రెండు వేరియంట్లతో పోలిస్తే అధికంగా ఉండొచ్చన్న అభిప్రాయం వైద్య నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. కేవలం వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధక చర్యల ద్వారానే మూడో విడతను అధిగమించగలమని పేర్కొంటున్నారు. ఒమిక్రాన్ లో స్వల్ప లక్షణాల మాట నిజమే అయినా.. అందరిలోనూ ఇలానే ఉంటుందని అనుకోవద్దు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరిన వారిలో 182 మందికి ప్రస్తుతం ఆక్సిజన్ అందిస్తున్నారు. 112 మంది ఐసీయూల్లో చికిత్స తీసుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more