Omicron Hospitalisation Numbers Increase In Telangana తెలంగాణలో ఒమిక్రాన్ ఉద్దృతి.. ఆసుపత్రులకు పెరుగుతున్న తాకిడి

Telangana no mild wave warn doctors as hospitalisation numbers rise

Omicron cases increase in Telangana, Omicron Hospitalisation increase in Telangana, omicron milder than delta, increase in Hospital bed occupancy, Bed Occupancy, Omicron, Delta variant, Private Hospitals, Gandhi Hospital, Hospitalisation, intensive care units (ICU), oxygen, Telangana, coronavirus news, Omicron, omicron cases in Telangana, Telangana Omicron case, Omicron Case Tally, Omicron Variant Alerts, Omicron in Telangana, First Omicron Hospitalisation, Omicron Case, Omicron Cases in Telangana

Earlier, news broke out that Omicron is mild and the hospitalization rate is less. According to the reports, 278 patients have been admitted to hospitals across Telangana in the last week and earlier, it was just three or four cases per day.

తెలంగాణలో ఒమిక్రాన్ ఉద్దృతి.. ఆసుపత్రులకు పెరుగుతున్న తాకిడి

Posted: 01/10/2022 06:48 PM IST
Telangana no mild wave warn doctors as hospitalisation numbers rise

కరోనా కొత్త రకం ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా లేదని, అయితే ఇది శరవేగంగా వ్యాప్తి చెందడంతో అసుపత్రుల పాలయ్యేవారి సంఖ్య పెరగడంతో ఇబ్బందులు ఏర్పడి, సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెప్పారు. దీంతో పెద్దగా ప్రాణహాని చేయడం లేదన్న భావన పెరిగిపోయి.. దేశ ప్రజల్లో నిర్లక్ష్యం అవహరించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలను బలితీసుకున్నా.. ప్రజల్లో మాత్రం ప్రభావం లేదన్న భావన తొలగిపోవడం లేదు. గత రెండు వేరియంట్లతో పోలిస్తే దీని ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ, ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలంగాణ వైద్యులు అంటున్నారు.

మరోవైపు డెల్టా వేరియంట్ ఇంకా వ్యాప్తిలోనే ఉంది. నిర్లక్ష్యానికి చోటు లేకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక కరోనా రెండు విడతలతో పోలిస్తే ఆసుపత్రిలో చేరాల్సిన కేసుల సంఖ్య ఇప్పటి వరకు తక్కువగానే ఉంటోంది. కానీ, గత వారంలో ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్టు వైద్యులు చెబుతున్నారు. గత వారం రోజువారీ 278 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స కోసం చేరారు. కానీ, అంతకు ముందు వారంలో చేరిన కేసుల సంఖ్య 3-4గానే ఉంది. ప్రస్తుతానికి ఆసుపత్రుల్లో బాధితుల సంఖ్య తక్కువగానే కనిపిస్తున్నా.. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే రకం కావడంతో ఎక్కువ మందికి సోకే అవకాశం వుంది.

తద్వారా ఆసుపత్రుల్లో చేరే బాధితుల సంఖ్య గత రెండు వేరియంట్లతో పోలిస్తే అధికంగా ఉండొచ్చన్న అభిప్రాయం వైద్య నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది. కేవలం వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధక చర్యల ద్వారానే మూడో విడతను అధిగమించగలమని పేర్కొంటున్నారు. ఒమిక్రాన్ లో స్వల్ప లక్షణాల మాట నిజమే అయినా.. అందరిలోనూ ఇలానే ఉంటుందని అనుకోవద్దు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరిన వారిలో 182 మందికి ప్రస్తుతం ఆక్సిజన్ అందిస్తున్నారు. 112 మంది ఐసీయూల్లో చికిత్స తీసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles