దేశంలో నూతన సంవత్సరం వేడుకల వేళ.. ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి మూడవ దశ ముపుతో విరుచుకుపడనుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది సంక్రాంతి నుంచి మరింత వేగం పుంజుకుని ఫిబ్రవరి 3 నాటికి తీవ్రస్థాయికి చేరుతుందని కూడా ఐఐటీ కాన్పూర్ అంచనా వేసింది. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టాతో పోల్చితే దాదాపు 30 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని కూడా వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు విదేశాలకు వెళ్లి వచ్చిన వ్యక్తులకు మాత్రమే సోకిన ఈ కొత్త మహమ్మారి తాజాగా ఎలాంటి వీదేశీయానం లేనివారికి కూడా సోకింది.
దేశంలో ఒమిక్రాన్ కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీ లలోనే ఈ కేసులు నమోదవుతున్నాయి. ఒమిక్రాన్ నేపథ్యంలో ఢిల్లీలో లెవల్ 2 దశ ఆంక్షలు అమలు చేస్తూ.. ఒమిక్రాన్ కట్టడికి చర్యలు చేపట్టారు. అయినా కేసులు మాత్రం పెరుగుతూనే వున్నాయి. ఇటు మహారాష్ట్రను ఒమిక్రాన్ వేరియంట్ అతలాకుతలం చేస్తున్నది. నిన్నటి వరకు ఒక్క మహారాష్ట్రలోనే 450 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకున్నా.. 141 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ముంబై ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. 141 మందిలో 93 మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారున్నారు.
ఇందులో 21 మంది కేవలం కే వెస్ట్ వార్డు నుంచి ఉన్నారు. అంధేరి వెస్ట్, జూహు, వేర్సోవా, డీ వార్డులో ఈ కేసులు నమోదు అయ్యాయి. నిన్న ముంబైలో 153 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ కాగా, ఇందులో 12 మంది మాత్రమే ఇంటర్నేషనల్ ప్యాసింటర్స్ ఉన్నారని బృహణ్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని ముంబైలోని ఒమిక్రాన్ కేసుల సంఖ్య 290కి చేరింది. మరోవైపు మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసులు రోజురోజకు పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే 190 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 30 మంది విదేశాల నుంచి వచ్చిన వారునున్నారు. దీంతో మొత్తం మహారాష్ట్రలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 450కి చేరింది.
ఇక దేశవ్యాప్తంగా కరనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 309 కేసులు నమోదయ్యాయి, దీంతో దేశంలో మొత్తంగా 1270 కేసులు నమోదుకాగా, అందులో మహారాష్ట్రలోనే అత్యధికంగా 450 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 320 పాజటివ్ కేసులతో రెండో స్థానంలో ఉంది. కేరళలో 109, గుజరాత్లో 97, రాజస్థాన్లో 69, తెలంగాణలో 62, తమిళనాడులో 46, కర్ణాటకలో 34, ఆంధ్రప్రదేశ్ 16, హర్యానాలో 14, ఒడిశాలో 14, పశ్చిమ బెంగాల్ లో 11 కేసులు నమోదు కాగా.. మరో 11 రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
ఇదిలావుండగా దేశంలో రెండో ఒమిక్రాన్ మరణం కూడా నమోదైంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్లో ఓమిక్రాన్ వేరియంట్ సోకిన 72 ఏళ్ల వృద్దుడు మరణించాడు.మరణానంతరం ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షలో కరోనా నెగిటివ్ అని నివేదికలు నిర్థారించడం గమనార్హం. రాజస్థాన్ ప్రభుత్వం ప్రకారం, రోగి డిసెంబరు 15న కోవిడ్ పాజిటివ్గా పరీక్షించబడ్డాడు మరియు డిసెంబరు 25న ఒమిక్రాన్ ఉన్నట్లు జన్యుక్రమం చూపించింది. అతను డిసెంబరు 30న కొమొర్బిడిటీ డయాబెటిస్ మెల్లిటస్, హైపర్టెన్షన్ మరియు హైపోథైరాయిడిజంతో పోస్ట్-కోవిడ్ న్యుమోనియా కారణంగా మరణించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more