దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ నెమ్మదిగా ప్రారంభమవుతున్న వేళ భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దానికి అడ్డుకట్ట వేసే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వచ్చే నెల మూడో తేదీ నుంచి 15-18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు టీకాలు వేయనున్నారు. అలాగే, 60 ఏళ్లు దాటి, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న దాదాపు 3 కోట్ల మందికి మూడో డోసు (ప్రికాషనరీ డోసు) ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మూడో డోసుగా ఏ వ్యాక్సిన్ వేసుకోవాలన్న సందేహాలు అందరిలోనూ నెలకొన్నాయి. తొలి డోసు తీసుకున్న కంపెనీ వ్యాక్సినే వేయించుకోవాలా? లేదంటే, ఈసారి వేరే కంపెనీ వ్యాక్సిన్ వేయించుకోవచ్చా? వంటి అనుమానాలు నెలకొన్నాయి.
ఈ అనుమానులకు నిపుణులు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. తొలి రెండు డోసులు ఏ వ్యాక్సిన్ అయితే తీసుకున్నారో, ప్రికాషనరీ డోసు కూడా అదే తీసుకోవాలని చెబుతున్నారు. దేశంలో ఇప్పటి వరకు 141 కోట్ల డోసుల పంపిణీ జరిగిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో సీరం ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్దే అగ్రభాగం. మొత్తం వ్యాక్సినేషన్లో కొవిషీల్డ్ వాటా ఏకంగా 89 శాతం ఉండడం గమనార్హం. 60 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న దాదాపు కోటి మందికి కొవిషీల్డ్ టీకా వేయాల్సి ఉంటుందని అంచనా. వీరికి జనవరి 10 నుంచి టీకాలు వేయనున్నట్లు ప్రకటించారు.
ఇక, పిల్లలకు మాత్రం కొవాగ్జిన్ టీకాతో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. జైడస్ కాడిలా అభివృద్ధి చేసిన ‘జైకోవ్-డి’కి కూడా అత్యవసర వినియోగానికి అనుమతి లభించినప్పటికీ ప్రస్తుత వ్యాక్సినేషన్ ప్రక్రియలో అది భాగం కావడం లేదు. అయితే, మిక్సింగ్ డోసులు వేసే విషయంలో నిర్ణయం తీసుకోవాలంటే మాత్రం క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు రావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 15-18 ఏళ్ల మధ్య పిల్లలు జనవరి 1 నుంచి కొవిన్ యాప్లో టీకా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆధార్, ఇతర ఐడీ కార్డులు లేని పిల్లలు విద్యాసంస్థలు జారీ చేసే స్టూడెంట్ ఐడీ కార్డులతోనూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీరందరికీ కోవాగ్జిన్ టీకాను జనవరి 3 నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more