పుణ్యం చేయబోతే పాపం ఎదురైందని కూడా ఒ నానుడి వుంది. అచ్చం అలాగే జరిగిందీ ముంబైలోని ఓ మహిళకు. కరోనా సమయంలో అన్నం కూడా లభించిన వలస కూలీల గురించి కధలు కథలుగా విన్నాం. కానీ పాపం మూగ జీవాలు ఏమైపోతాయో అని కొందరు మాత్రమే ఆలోచించారు. అలాంటి వారిలో ఈ ముంబైకి చెందిన మహిళ ఒకరు. వీధి కుక్కలపై ఎంతో దయ చూపుతూ వాటికి ఆహారాన్ని అందించిందామె. అయితే అమె చేసిన మంచి పనికి స్థానికులు, ఇరుగుపోరుగువారు అభినందించాల్సింది పోయి.. అమెకు జరిమానా విధించారు. అది కూడా ఏకంగా లక్షల రూపాయాల్లో. దీంతో విస్తుపోయిన అమె జరిగింది ఏంటో తెలుసుకునే సరికి షాకింగ్ కుగురైంది.
నవీ ముంబయిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. అన్నం పెట్టడం పుణ్యకార్యమే కానీ పాపకార్యం కాదు. కానీ మూగజీవాలకు అన్నం పెట్టిన ఈ మహిళకు మాత్రం అదే శాపంగా మారింది. ఏకంగా ఎనిమిది లక్షల రూపాయలను జరిమానాగా చెల్లించాలని అదేశించింది. ఓ ఎన్నారై గృహ సముదాయంలో నివసించే అన్షు సింగ్ అనే మహిళ రోజూ వీధి కుక్కలకు ఆహారం పెడుతోంది. ఆ గృహ సముదాయంలో 40 వరకు ఇళ్లు ఉన్నాయి. అయితే తమ హౌసింగ్ కాంప్లెక్స్ లో వీధి కుక్కలతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఇతరులు మేనేజింగ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను పరిశీలించిన కమిటీ అన్షు సింగ్ పై తమ నిబంధనల మేరకు జరిమానా విధించింది.
ఆ హౌసింగ్ కాంప్లెక్స్ లో వీధికుక్కలకు ఆహారం వేస్తే రోజుకు రూ.5 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ లెక్కన అన్షు సింగ్ కు ఇప్పటివరకు విధించిన జరిమానాల మొత్తం రూ.8 లక్షలకు చేరింది. ఈ మొత్తాన్ని అమె నిర్దేశిత సమయంలోపు ఎన్నారై గృహ సముదాయం కాలనీ యాజమాన్యానికి చెల్లించాల్సి వుంటుంది. కాగా ఇదే కాంప్లెక్స్ లో నివసించే లీలా వర్మ అనే మహిళ మాట్లాడుతూ, కాంప్లెక్స్ లోపల వీధి కుక్కలకు ఆహారం పెట్టే వారి పేర్లను వాచ్ మన్ నమోదు చేసుకుంటాడని వెల్లడించారు. మరి వాచ్ మెన్ వీధి కుక్కలను ఎందుకు సముదంలోకి
ఈ ఘటనపై హౌసింగ్ కాంప్లెక్స్ కార్యదర్శి వినీత శ్రీనందన్ స్పందిస్తూ, తమ గృహ సముదాయం లోపల వీధి కుక్కలు యథేచ్ఛగా సంచరిస్తుండడంతో పిల్లలు ట్యూషన్లకు వెళ్లలేకపోతున్నారని, వృద్ధులు అసౌకర్యానికి గురవుతున్నారని వివరించారు. అంతేకాకుండా పార్కింగ్ ప్రదేశంలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ కుక్కలు అపరిశుభ్రతకు కారణమవుతున్నాయని, కాంప్లెక్స్ లోపల కుక్కలతో రణరంగంలా మారిందని పేర్కొన్నారు. దాంతో ఇక్కడ నివాసం ఉండేవారు సరిగా నిద్ర పోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాపోయారు. వీధి కుక్కల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నప్పటికీ, వాటికి బహిరంగ ప్రదేశాల్లో ఆహారం అందిస్తున్నారని వినీత ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
May 28 | పెంపుడు కుక్కతో పాటు వాకింగ్ చేసేందుకు స్టేడియం ఖాళీచేయించిన ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధీగా ఉండాల్సిన ఐఏెఎస్ అధికారులు కూడా నాయకులను మించిపోతున్నారని... Read more
May 28 | కన్న కొడుకు సక్రమమైన మార్గంలో నడవాలని ఏ తల్తైనా కోరుకుంటోంది. అదే కొడుకు తెలిసి.. చేసినా తెలియక చేసినా కొడుకును ఓ వైపు మందలిస్తూనే.. మరోవైపు తన కోడుకును వెనుకేసుకొస్తోంది. అమెది మాతృ హృదయం.... Read more
May 28 | కాలం మారింది.. కాలంతోపాటు మనుషులు కూడా మారుతున్నారు. సంప్రదాయాలను పాతచింతకాయ పచ్చడిలా భావిస్తున్న యువతరం నిత్యం ట్రెండీ ఆలోచనలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. పదిమందిలో కొత్తగా కనిపించాలని అనుకోవడమే కాదు.. విభిన్నంగా అలోచించి జీవితంలో... Read more
May 28 | తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత నందమూరి తారకరామారావు శత జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఆయన ఘాట్ వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ తెల్లవారుజామున ఎన్టీఆర్ ఘాట్కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్రామ్ పుష్పగుచ్ఛాలు ఉంచి... Read more
May 27 | హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఇండియన్ లోక్ దళ్ మాజీ అధ్యక్షుడు వృద్దనేత ఓం ప్రకాశ్ చౌతాలా మరోమారు కారాగారవాసానికి వెళ్లనున్నారు. ఇటీవలే ఆయన ఉపాధ్యయుల అక్రమ నియామకాల కేసులో జైలు శిక్షను అనుభవించి.. విడుదలయ్యారు.... Read more