అడవిలో వన్యప్రాణులను నేరుగా చూసేందుకు ఆ అనుభవాన్ని తమ మిత్రులకు, భావితరాలతో పంచుకునేందుకు ఉత్సాహపడే వారు అడవుల్లోకి, సాంచురీల్లోకి వెళ్లి.. అక్కడి వన్యమృగాలను, క్రూర మృగాలను వీక్షిస్తుంటారు. అయితే ఇలా అడవుల్లోకి ఏ సమయంలో పడితే ఆ సమయంలో వెళ్లకూడదని అటవీశాఖ అధికారులతో పాటు.. పెద్దలు కూడా చెబుతుంటారు. దానికంటూ ఓ ప్రత్యేకమైన సమయాలు వుంటాయని కూడా చెబుతారు. ఏ సమయాల్లో అడవుల్లోకి వెళ్లాలి అనే కన్నా.. ఏ సమయాల్లో అడవుల్లోకి వెళ్లకూడదో పెద్దలు చెబుతారు.
అడవుల్లో మరీ ముఖ్యంగా వన్యప్రాణులు జతసాంగత్యం కోరే సమయాల్లో అటుగా వెళ్లరాదని అటవీ శాఖ అధికారులు చెబుతారు. ఎందుకంటే అవి సాంగత్యం కోరే సమయంలో చాలా విసుగుచెంది వుంటాయని.. ఆ సమయాల్లో అడవుల్లోకి వెళ్తే అవి దాడి చేస్తాయని పలు సందర్భాలలో ఇలా వెళ్లినవారు కొందరు మృత్యువాత పడగా, మరికోందరు బతుకు జీవుడా అంటూ గాయాలపాలై బయటపడ్డారని అటవీ అధికారులు చెప్పారు. అయితే ఇలా అడవుల్లోకి వన్యప్రాణులను వీక్షించేందుకు వెళ్లే సమయాలను తెలుసుకోవడం అత్యంత ముఖ్యమని కూడా వారుచెబుతారు.
ఇలా వన్యప్రాణులను వీక్షించేందుకు ఫారెస్ట్ రిజర్వ్ కి వెళ్లిన విద్యార్థుల బృందానికి చేదు అనుభవం ఎదురైంది. దక్షిణాఫ్రికా లింపోపోలోని సెలటి గేమ్ రిజర్వ్ కి కొందరు విద్యార్థులు వెళ్లగా వారిపై భారీ ఏనుగు దాడి చేసింది. సాంగత్యం కోసం ఒకచోటకు చేరుకున్న ఏనుగుల గుంపుకు చేరువగా వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. అయితే అదేసమయంలో మరోవైపు నుంచి ఒక్కసారిగా వారి వాహనం ముందు ప్రత్యక్షమైన భారీ ఏనుగు వారు ప్రయాణిస్తున్న సఫారీ వాహనాన్ని ధ్వంసం చేసింది. దాడి సమయంలో ఏనుగు నుంచి తప్పించుకునేందుకు విద్యార్థులు పరుగులు తీశారు. తమ వస్తువులను ఎక్కడిక్కడ వదిలేసి మరీ తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more