అడవిలో వన్యప్రాణులను నేరుగా చూసేందుకు ఆ అనుభవాన్ని తమ మిత్రులకు, భావితరాలతో పంచుకునేందుకు ఉత్సాహపడే వారు అడవుల్లోకి, సాంచురీల్లోకి వెళ్లి.. అక్కడి వన్యమృగాలను, క్రూర మృగాలను వీక్షిస్తుంటారు. అయితే ఇలా అడవుల్లోకి ఏ సమయంలో పడితే ఆ సమయంలో వెళ్లకూడదని అటవీశాఖ అధికారులతో పాటు.. పెద్దలు కూడా చెబుతుంటారు. దానికంటూ ఓ ప్రత్యేకమైన సమయాలు వుంటాయని కూడా చెబుతారు. ఏ సమయాల్లో అడవుల్లోకి వెళ్లాలి అనే కన్నా.. ఏ సమయాల్లో అడవుల్లోకి వెళ్లకూడదో పెద్దలు చెబుతారు.
అడవుల్లో మరీ ముఖ్యంగా వన్యప్రాణులు జతసాంగత్యం కోరే సమయాల్లో అటుగా వెళ్లరాదని అటవీ శాఖ అధికారులు చెబుతారు. ఎందుకంటే అవి సాంగత్యం కోరే సమయంలో చాలా విసుగుచెంది వుంటాయని.. ఆ సమయాల్లో అడవుల్లోకి వెళ్తే అవి దాడి చేస్తాయని పలు సందర్భాలలో ఇలా వెళ్లినవారు కొందరు మృత్యువాత పడగా, మరికోందరు బతుకు జీవుడా అంటూ గాయాలపాలై బయటపడ్డారని అటవీ అధికారులు చెప్పారు. అయితే ఇలా అడవుల్లోకి వన్యప్రాణులను వీక్షించేందుకు వెళ్లే సమయాలను తెలుసుకోవడం అత్యంత ముఖ్యమని కూడా వారుచెబుతారు.
ఇలా వన్యప్రాణులను వీక్షించేందుకు ఫారెస్ట్ రిజర్వ్ కి వెళ్లిన విద్యార్థుల బృందానికి చేదు అనుభవం ఎదురైంది. దక్షిణాఫ్రికా లింపోపోలోని సెలటి గేమ్ రిజర్వ్ కి కొందరు విద్యార్థులు వెళ్లగా వారిపై భారీ ఏనుగు దాడి చేసింది. సాంగత్యం కోసం ఒకచోటకు చేరుకున్న ఏనుగుల గుంపుకు చేరువగా వెళ్లేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. అయితే అదేసమయంలో మరోవైపు నుంచి ఒక్కసారిగా వారి వాహనం ముందు ప్రత్యక్షమైన భారీ ఏనుగు వారు ప్రయాణిస్తున్న సఫారీ వాహనాన్ని ధ్వంసం చేసింది. దాడి సమయంలో ఏనుగు నుంచి తప్పించుకునేందుకు విద్యార్థులు పరుగులు తీశారు. తమ వస్తువులను ఎక్కడిక్కడ వదిలేసి మరీ తప్పించుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
(And get your daily news straight to your inbox)
Aug 17 | స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల వేళ.. ప్రధాని నరేంద్రమోడీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా చేసిన ప్రసంగానికి ఆ మరుసటి రోజున.. బీజేపి పాలిత రాష్ట్రంలోనే తూట్లు పోడిచారు. ప్రధాని మోడీ సోంత రాష్ట్రం... Read more
Aug 17 | జేబులో డబ్బులు పెట్టుకుని తిరిగితే.. ఎవరైనా జేబు దొంగలు కొట్టేస్తారేమో అన్న అందోళన అవసరం లేకుండా.. ఎంచక్కా.. డిజిటల్ పే వచ్చేసింది. ఇక ఎదో ఒకచోట డబ్బు అవసరం అయితే.. అక్కడికక్కడే కనిపించే ఏటీఎంకు... Read more
Aug 17 | మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఎదురుగా వస్తున్న గూడ్సు రైలును.. అదే మార్గంలో వస్తున్న ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. దీంతో ప్యాసింజర్ రైలులోని... Read more
Aug 17 | మధుమేహ రోగులకు శుభవార్తను అందించారు వైద్యశాస్త్ర పరిశోధకులు. కరోనా మహమ్మారి బారిన పడిన మధుమేహ వ్యాధిగ్రస్తులు దాని నుంచి బయటపడేందుకు మానసికంగా, శారీరికంగానూ చేసిన పోరాటం వల్లే అనేక మంది బతికి బయటపడగా, కొందరు... Read more
Aug 17 | కలియుగ వైకుంఠంగా బాసిల్లుతున్న తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కరోనా మహమ్మారికి మునుపటి స్థితికి చేరుకుని ఇప్పుడిప్పుడే భక్తులకు ఆలవాలంగా మారుతోంది. ఈ తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... Read more