యావత్ దేశవ్యాప్తంగా ప్రజలందరూ దేశి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆద్యాత్మిక భావనలో తన్మయత్వం పొందుతున్న తరుణంలో.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇదే అదునుగా భావించి వంటగ్యాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కేంద్రప్రభుత్వ, చమురు కంపెనీల తీరును నిరసిస్తూ తెలంగాణ మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రాష్ట్రంలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో సంబురాలు మొదలు కాగా, అదే పండుగ సంబరాన్ని తమ నిరసనను వ్యక్తం చేసేందుకు పూనుకున్నారు. తమ ఉత్సవాలతో పాటు నిరసనలను కూడా ఒకే వేదిక నుంచి కేంద్రానికి తెలియజేశారు.
ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మహిళలు బతుకమ్మల మధ్య సిలిండర్లను పెట్టి తమ నిరసనను తెలిపారు. ఇక పెంచిన గ్యాస్ ధరలకు.. రోజురోజుకీ పైపైకి ఎగబాకుతున్న పెట్రోల్ ధరలను నిరసిస్తూ.. అప్పటికప్పుడే ట్యూన్లు కట్టి మరీ పాటలను పాడుతూ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. గతంలో దసరా, దీపావాళి, సంక్రాంతి లాంటి పండుగలు వచ్చినప్పుడు.. తాము కూడా పండుగ పూట ఉత్సాహంగా ఉండాలని ప్రభుత్వాలు తమకు పలు వస్తువులను కారుచౌకగా అందించేవని అన్నారు.
రేషన్ దుకాణాలలో కంది, శనగ పప్పులతో పాటు పంచధార, వంట నూనె, గోదుమలు ఇవీ కాక పలు రకాల వస్తువులను కూడా మార్కెట్ రేటు కన్నా చౌకగా అందించేవారని.. పండగ అంటే అందరిదనీ.. దీంతో పేదవాళ్లు కూడా పండగ జరుపుకోవాలని ప్రభుత్వాలు ఇలా తమకు చౌకగా అందించేవన్నారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రభుత్వాలు రేషన్ దుకాణాలను బియ్యానికి మాత్రమే పరిమితం చేశాయని, పేదలు గొదుమ రెట్టెలు, శనగపిండితో వంటకాలు చేసుకోకూడదనా.? చక్కర, వంట నూనెలను అసలు అందించమే మానేశాయని వాపోయారు.
ఇది చాలదన్నట్లు ఇక పండగ వేళ.. తమ జేజులోని డబ్బులన్నీ పెట్రోల్, డీజిల్, గ్యాస్ పేరుతో లాక్కోవడం మరింత దారుణమన్ని అక్షేపించారు. బతుకమ్మల మధ్యలో సిలిండర్ పెట్టి ఆటలాడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇదిలా ఉండగా.. గడిచిన రెండు నెలల్లో వంటగ్యాస్ ధరలు నాలుగుసార్లు పెరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్పై రూ.205 పెరిగింది. దీంతో సామాన్యులకు గ్యాస్ ధరలు గుదిబండలా మారాయి. మళ్లీ కట్టెలపొయ్యిపై వంట చేసుకునే రోజులు వస్తాయేమోననంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈరోజు బిజెపి నాయకులు పండగ తో చేసిన ఫేక్ ప్రచారాన్ని వారికి బుద్ధి వచ్చేటట్టు సమాధానం చెబుతూ తిప్పికొట్టిన హుజూరాబాద్ మహిళలు .... pic.twitter.com/8uTnBHH7Xs
— krishanKTRS (@krishanKTRS) October 6, 2021
(And get your daily news straight to your inbox)
Aug 11 | ఉచిత పధకాలను వ్యతిరేకిస్తున్న కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ తీరును దుయ్యబడుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. దేశంలోని ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వాలుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలని రాజ్యంగంలోనే ఉందని..... Read more
Aug 11 | అమరావతి రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం సిద్ధం చేసిన డిజైన్లను తీసుకోనందుకు ఫోస్టర్ అండ్ పార్టనర్స్ కంపెనీ సుప్రీంకోర్టులో మధ్యవర్తిత్వ పిటిషన్ దాఖలు... Read more
Aug 11 | విమానంలో ధూమపానం అత్యంత ప్రమాదకర పరిణామాలకు దారితీస్తుంది. పొరపాటున ఊహించనది జరిగితే అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయంతే! అలాంటి చోట నియమాలు. భద్రతా నిబంధనలను పూర్తిగా విస్మరిస్తూ, స్పైస్జెట్ విమానంలో ఓ ఇన్స్టా సెలబ్రిటీ... Read more
Aug 11 | ఎన్నికలకు ముందు ఉచిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలుపర్చడంలో విఫలమైన రాజకీయ పార్టీల గుర్తింపును రద్దు చేయడం సమంజసం కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉచిత హామీలపై... Read more
Aug 11 | తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కేసీఆర్ను టార్గెట్ చేస్తూ బీజేపీ సరికొత్త డిజిటల్ బోర్డు ప్రచారానికి తెరలేపింది. తెలంగాణలో సీఎం కేసీఆర్... Read more