Bandi Sanjay slams KTR On Cheating Telanganites రెండు తెలుగు రాష్ట్రాలు.. ఒకే ఫోటోతో ప్రచారం: బండి సంజయ్

Bandi sanjay slams ktr on cheating telanganites

Bandi Sanjay, cheating, wrong propaganda, KT RamaRao, Vijaysai Reddy, Twitter, Healthcare workers, corona vaccination, Telangana, AP, Politics

Telangana BJP President Bandi Sanjay slams Minister KTR On Cheating Telanganites over a Twitter post, As the Minister clams the commitment of Health workers in the state in vaccinating the People of Telangana through this post.

రెండు తెలుగు రాష్ట్రాలు.. ఒకే ఫోటోతో ప్రచారం: బండి సంజయ్

Posted: 09/24/2021 09:25 PM IST
Bandi sanjay slams ktr on cheating telanganites

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు సంబంధించి ఓ ఫొటో నెట్టింట సందడి చేస్తోంది. ఆరోగ్య కార్యకర్తలు పొలంలోకి వెళ్లి మరీ రైతులకు, రైతుల కూలీలకు వ్యాక్సిన్ వేస్తున్న దృశ్యాలను ఆ ఫొటోలో చూడొచ్చు. అయితే ఆ ఫొటోను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇద్దరూ ట్వీట్ చేశారు. దీంతో ఈ ఇద్దరు నేతలు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను గుడ్డివాళ్లు అని అనుకుంటున్నారని తలెంగాణ బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాక్సినేషన్ ఉద్యమంలా సాగుతుందనడానికి ఈ ఫొటోనే నిదర్శనం అని విజయసాయిరెడ్డి, మా ఆరోగ్య శాఖ సిబ్బంది అంకితభావం చూడండి అంటూ కేటీఆర్ లు ఒక్కటే ఫొటోను పంచుకోవడంపై స్పందించిన ఆయన.. రెండు రాష్ట్రాల నేతలు ఒకేటే ఫోటోను తమదని చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇంకా ఏమన్నారంటే.. "విజయసాయి, కేటీఆర్ ఇద్దరూ ఒకే ఫొటో పంచుకున్నారు, జనాలు మరీ ఇంత గుడ్డివాళ్లనుకుంటారో, ఏమో!" అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఈ మేరకు వాళ్లిద్దరూ చేసిన ట్వీట్లను బండి సంజయ్ పంచుకున్నారు.

"ప్రజారోగ్యం మీద తమ చిత్తశుద్ధిని నిరూపించాలని అనుకోవడంలో ఉన్న చిత్తశుద్ధి... అసలైన చిత్తశుద్ధి చూపించడంలో లేదని చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం. ఒకే సినిమా బోలెడు థియేటర్లలో ఆడినట్టు... ఈ ఒకట్రెండు ఫొటోలే అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ షికారు చేస్తున్నాయి. ఇదిగో, పొలాల్లోకి వెళ్లి మరీ వ్యాక్సిన్లు వేస్తున్న మా ప్రభుత్వ గొప్ప చూడండి అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్, ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎలా ట్వీట్లు చేసుకుంటున్నారో చూడండి" అంటూ ఎద్దేవా చేశారు.

"అసలు కామెడీ ఏంటంటే... మనుషుల్ని పోలిన మనుషులుంటారని తెలుసు కానీ... ఇలా పొలాల్ని పోలిన పొలాలు, రైతులను పోలిన రైతులు, నర్సులను పోలిన నర్సులు ఉంటారని ఇప్పుడు తెలుస్తోంది. వీళ్ల రాజకీయాలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. "కొసమెరుపు ఏంటంటే.. కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్లను ఉచితంగా ఇస్తుంటే ప్రచారం కోసం వీళ్లు పోటీ పడుతున్నారు" అంటూ బండి సంజయ్ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles