జగన్ అక్రమాస్థుల కేసులో అభియోగాలు ఎదర్కోంటున్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీపై నాంపల్లిలోని సీబిఐ కోర్టు నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీచేసింది. ఈ కేసులో పాటు అనుబంధంగా వున్న దాల్మియా సిమెంట్స్ కేసులో తరచూ గైర్హాజరవుతున్న శ్రీలక్ష్మిపై న్యాయస్థానం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో భాగంగా వున్న ఉన్నత అధికారులే తమపై వున్న కేసుల విచారణకు న్యాయస్థానాలకు హాజరుకాకపోవడంపై మండిపడిన న్యాయస్థానం అమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నాంపల్లిలోని ఈడీ, సీబీఐ ప్రత్యేక కోర్టులో కేసు విచారణ జరిగింది. ఈ సందర్భంగా విచారణకు తరచూ గైర్హాజరవుతున్న శ్రీలక్ష్మిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ఇదిలావుండగా ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులోనూ ఏ6 నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. తనపై సీబీఐ అధికారులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని అమె రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గత ఏడాది దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆ పిటిషన్ ను కొట్టేసింది. నిబంధనలు ఉల్లంఘించి మరీ మైనింగ్ లీజు ఇచ్చారని, నిందితులతో కుమ్మక్కుకావడం ద్వారా ప్రభుత్వాన్ని మోసగించారన్న అభియోగాలు ఉన్నాయని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. క్వాష్ పిటిషన్ ను కొట్టేస్తున్నట్టు పేర్కొంది. అలాగే, గతంలో పిటిషనర్కు అనుకూలంగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సైతం ఎత్తేస్తున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.
ఇదిలావుంచితే, రాంకీ కేసులో విచారణకు హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి.వెంకట్రామిరెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేకపోయానని, తనపై గతంలో జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్ను కొట్టివేయాలని కోరారు. స్పందించిన కోర్టు దానిని కొట్టివేసింది. వాన్పిక్ కేసులో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డిల తరపున న్యాయవాదుల హాజరుకు హైకోర్టు అనుమతించినా వారు కూడా డుమ్మా కొట్టడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసిన కోర్టు.. ఈసారి విచారణకు రాకుంటే తగిన ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more