ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఆస్తులపై ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని ఆయన నివాసంతోపాటు.. నాగ్ పూర్, జైపుర్ లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోనూ సూద్ ఛారిటీ ఫౌండేషన్ బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలించారు. దాడులు పూర్తైన తర్వాత ఐటీ అధికారులు సోనూసూద్.. రూ.20 కోట్లకు పైగా ట్యాక్స్ ఎగ్గొట్టాడని వెల్లడించారు. దీనిపై తాజాగా సోనూసూద్ స్పందించారు. తన ఫౌండేషన్లో ప్రతి రూపాయి కూడా నిరుపేదల జీవితాల కోసం పోగు చేసిందేనని అన్నాడు. నిరుపేదల ప్రేమతో అధ్వాన్నంగా ఉన్నరోడ్లపై కూడా తన ప్రయాణం సులభం అవుతుందని అన్నారు.
ఇక మన నిజాయితీ గురించి మనమే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాలమే నిజానిజాలను కాలక్రమేనా వెల్లడిస్తుందని అన్నారు. దేశంలోని ప్రజలకు సేవ చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని.. తనకు అదే కొండంత బాలానిస్తుందని అన్నారు. అంతేకాదు తన జర్నీ ఇలాగే కొనసాగుతుంటుందని సష్టం చేశారు. మానవతా కారణాలతో కొన్ని బ్రాండ్లను సైతం ప్రోత్సహించానని.. నాలుగు రోజులుగా తాను తన అతిథులు( ఐటీ అధికారులు)తో బిజీగా ఉన్నాను. ఆ కారణం వల్లనే ప్రజల సేవలో ఉండలేకపోయానని అన్నారు. ఇప్పుడు తిరిగి వచ్చానని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. తాను చట్టానికి కట్టుబడే పౌరుడిని అని తెలిపారు.
ఆదాయపన్ను శాఖ అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, వివరాలను సమర్పించానని, వాళ్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, తన పాత్ర తాను పోషించినట్లు సోనూసూద్ తెలిపారు. అయితే తనిఖీలు నిర్వహించిన ఐటీశాఖ అధికారులు తాను చేసిన పనులను మెచ్చుకున్నారని, తన పనితనానికి గుర్తింపు ఇచ్చినట్లు చెప్పారు. మీరెప్పుడైనా ఇలాంటి డాక్యుమెంట్లు, పేపర్ వర్క్ను చూశారా అని ఐటీ అధికారుల్ని అడిగానని, తాము ఎప్పుడూ ఇలాంటి పేపర్ వర్క్ చూడలేదని వారు చెప్పినట్లు సోనూసూద్ గుర్తు చేశారు.
తాను ప్రజలకు మరీ ముఖ్యంగా కరోనా సమయంలో వలస కూలీలకు బోజనం, వారి స్వస్థలాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యాలు కల్పించడంతో ఆయన చేసిన సేవలకు గాను తనకు రెండుసార్లు రాజ్యసభ సీటును ఆఫర్ చేశారని, కానీ ఆ ఆఫర్లను వదులుకున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పుడే రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా లేనట్లు ఆయన తెలిపారు. దాతృత్వ పనులను ఆపలేదని, ప్రజలకు సేవ చేస్తూంటూనే ఉన్నానన్నారు. ఇటీవల సోనూసూద్.. దిల్లీ ‘ఆప్’ ప్రభుత్వం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. సీఎం కేజ్రీవాల్ను కూడా కలిశారు. ఈ నేపథ్యంలో తాజా ఐటీ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more