వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో మరోమారు ర్యాగింగ్ తో వార్తల్లో నిలిచింది. ఈ కళాశాలలో మరోమారు ర్యాగింగ్ భూతం జడలు విప్పిందన్న వార్త కలకలం రేపింది. కాలేజీలో సీనియర్లు మొదటి విద్యా సంవత్సరం విద్యార్థులను పరిచయం చేసుకునే క్రమంలో సరదా సాగాల్సిన ర్యాగింగ్.. జూనియర్ విద్యార్థులను ఏకంగా వారికి బానిసలుగా మార్చి.. వారు చెప్పింది ఎదురు మాట్లాడకుండా చేయాల్సిన పరిస్థితులకు దారితీస్తోంది. అంతేకాదు మరికోందరైతే వారి బట్టలను విప్పించి మరీ శునకానందం పోందుతుంటారు.
తాజాగా కాకతీయ మెడికల్ కాలేజీలోనూ అలాంటి ఆగడాలే జరిగాయి. మొదటి సంవత్సరంలో చేరిన ఓ విద్యార్థిని పట్ల సీనియర్లు తమ జులుం ప్రదర్శించారు. అయితే వారిని లెక్కపెట్టని విద్యార్థిని తన పని తాను చేసుకుంటూ వెళ్లడంతో సీనియర్లు అమెను టార్గెట్ చేశారు. హాస్టల్ గదిలోకి వెళ్లి మరీ విద్యార్థిని వేధింపులకు గురిచేశారు. తనను ర్యాగింగ్ చేయవద్దని ఎంత వేడుకున్నా విననీ సీనియర్లు అమెను దుస్తులు విప్పాలని అదేశించడంతో.. తీవ్రంగా మానసిక క్షోభకు గురైన విద్యార్థి తన తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపాడు. ఉత్తరప్రదేశ్ లోని ఓ రాజకీయ కుటుంబానికి చెందిన విద్యార్థి జాతీయ కోటాలో సీటు సాధించి కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు.
దీంతో కలవరపాటుకు గురైన బాధిత విద్యార్థి తల్లిదండ్రులు నేరుగా వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి చేరుకున్నారు. అయితే జరిగిన పరాభవం పట్ల అప్పటికే తాను ప్రిన్సిపాల్ కు చెప్పినా అయన పెద్దగా చర్యలు తీసుకున్నట్లు కనిపించలేదని విద్యార్థిని తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నేరుగా విషయాన్ని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీఎంఈ రమేశ్రెడ్డి వరంగల్ కేసీఎంసీకి వచ్చి ర్యాగింగ్ ఘటనపై ఆరా తీశారు. ఈ విషయమై కేఎంసీ ప్రిన్సిపాల్ మోహన్దాస్ మాట్లాడుతూ.. ర్యాగింగ్ చేసిన విద్యార్థులు క్షమాపణ చెప్పడంతో వివాదం సమసిపోయిందన్నారు. మరోవైపు, బాధిత విద్యార్థి తల్లిదండ్రులు మాత్రం వారి క్షమాపణతో శాంతించలేదని సమాచారం. ప్రస్తుతం వారు వరంగల్ లోనే ఉన్నారని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more