పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత చలరేగిన హింసపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబిఐ దర్యాప్తును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీబీఐ ఇప్పటి వరకు తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కలకత్తా హైకోర్టులోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అదేశానుసారం దర్యాప్తును ప్రారంభించిన సీబిఐ 12 హత్యలతో పాటు 29 అత్యాచార ఘటనలపై దర్యాప్తును చేస్తోంది. ఈ కేసులన్నింటినీ ఆరు వారాల్లోగా దర్యాప్తు చేసి ప్రాథమిక నివేదికను అందేజేయాలన్న కలకత్తా హైకోర్టు అదేశాల మేరకు దర్యాప్తు సంస్థ తమ దర్యాప్తును ముమ్మరం చేసింది.
ఈ తరుణంలో నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలుగా ఏర్పడిన సీబిఐ రాష్ట్రంలోని హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాలకు పంపినట్లు ఓ అధికారి చెప్పారు. ఈ బృందాలలో సీబిఐ తూర్పు జోన్ డీఐజీ అఖిలేష్ కుమార్ సింగ్ కూడా ఉన్నారు. ఈ నాలుగు బృందాలు వివిధ హింసాత్మక ఘటనలకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి ఎఫ్ఐఆర్ కాఫీలతో పాటు న్యాయస్థానాల నుంచి పలు డాక్యూమెంట్లను కూడా సేకరించి పరిశీలిస్తాయని సమాచారం. ఈ క్రమంలో కేసు డాకెట్కు సంబంధించిన పిర్యాదుదారులతో, సాక్ష్యులను కూడా కలసి వారి పిర్యాదులను సెక్షన్ సిఆర్పీసీ 161, సిఆర్పీసీ 164ల మేరకు మెజిస్ట్రేల్ ముందు రికార్డు చేయనున్నారు,
హింసాత్మక ఘటనలు జరిగిన జిల్లా ఎస్పీలు పంపిన వివరాలను కూడా సీబిఐ బృందాలు పరిశీలించనున్నాయి. ఇక ఇప్పటికే తమ తాతను కోల్పోయిన బీజేపి కార్యకర్త విశ్వజీత్ సర్కార్ కు సీబిఐ విచారించేందుకు సమన్లను జారీ చేసిన సీబిఐ.. ఆయన నుంచి మరింత కొత్త సమాచారాన్ని రాబట్టడంతో పాటు ఆయన సెల్ ఫోన్ నుంచి తన తాత అభిజిత్ సర్కర్ హత్యకు సంబంధించిన ఫూటేజీని కూడా స్వాధీనం చేసుకుంది. మరికొన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, వాటిలో కొన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అనేక చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్న విషయం విధితమే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more