నిజామాబాద్ జిల్లాలో ఓ ఉగ్రవాది అరెస్ట్ అయ్యాడు. కౌంటర్ ఇంటెలిజెన్స్ కు చెందిన అధికారులు ఈ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. అయినా ఈ విషయం మాత్రం జిల్లా పోలీసులకు ఇప్పటికీ తెలియలేదు.దేశం కానీ దేశాలకు జీవనోపాధి కోసం వలస వెళ్లిన కొందరు అక్కడ ఎలాంటి నేరాలకు పాల్పడుతున్నారన్న విషయం జిల్లాలోని పోలీసు యంత్రాంగానికి తెలియకపోవడం గమనార్హం. దీంతో విదేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి ఆదేశ పోలీసులకు చిక్కి.. అరెస్టైన నేరస్థులు ఏమీ తెలియదన్నట్లు తిరిగి స్వదేశానికి వచ్చి ఎంచక్కా వచ్చేస్తున్నారు.
పాత పరిచయాల నేపథ్యంలో స్వదేశానికి తిరిగివచ్చిన ఉగ్రవాదులు.. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు.? ఏ వ్యవహరాలు చేస్తున్నారు.? ఏమైనా సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా.? ఉగ్రవాద చర్యలకు ఊతంగా నిలుస్తున్నారా.? అన్న విషయాలపై నిఘా కరువవుతోంది. దీంతో దేశంలో ఉగ్రవాదుల కార్యకలాపాలకు పాల్పడే వారి సంఖ్య నానాటికే పెరుగుతోంది. సౌదీ అరేబియాలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ పట్టుపడి ఏడాదిన్న కాలం జైలు శిక్ష అనుభవించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడు ఆ దేశ క్షమాభిక్ష పెట్టడంతో శిక్షాకాలం పూర్తికాకుండానే విడుదలై స్వదేశానికి చేరుకున్నాడు.
అతడు కనిపించకపోవడంతో భారత రాయబార కార్యాలయం ద్వారా అతడి ఆచూకీని గుర్తించి ఇంటెలిజెన్స్ బ్యూరోకు సమాచారం ఇచ్చారు. వారు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. రంగంలోకి దిగిన దిగిన హైదరాబాద్ కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం నిజామాబాద్ జిల్లా బోధన్ రెంజల్ బేస్ లో ఉన్న యువకుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కాగా, కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు తమకైతే ఎలాంటి సమాచారం లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ స్పష్టం చేశారు.
నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన 35 ఏళ్ల వ్యక్తిని హైదరాబాద్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నా జిల్లా పోలీసులకు మాత్రం ఎలాంటి సమాచారం లేకపోవడం కలకలం రేపింది. యువకుడిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు ఇప్పటి వరకు ధ్రువీకరించనప్పటికీ, స్థానికులు మాత్రం అతడిని క్రితం రోజునే పోలీసులు తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. గతంలో సౌదీ అరేబియా వెళ్లిన యువకుడు అక్కడ పాకిస్థాన్ యువకుడితో కలిసి ఆ దేశం తరపున గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో ఇద్దరూ ఏడాదిన్నరపాటు జైలు శిక్ష అనుభవించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన యువకుడు భారత్కు అక్రమంగా తిరిగి వచ్చినట్టు గుర్తించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more