వీడు నరమాంస భక్షకుడు. కన్నతల్లినే చంపి ముక్కలు ముక్కలుగా చేసి పచ్చి మాంసాన్ని తిన్న నరరూప రాక్షసుడు. తల్లి మాంసపు ముక్కలను ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టి నిల్వ చేసుకున్నాడు. అంతేకాదు తాను తినగా మిగిలిన మాంసం ముక్కలను కుక్కలకు వేశాడు. తన తల్లి మాంసంలోని కొంత బాగాన్ని పచ్చిగానే తిన్న నరమాంస భక్షుకుడు.. మరికొంత బాగాన్ని ఉడికించుకుని తిన్నాడు. ఘోరమైన ఉన్మాదానికి పాల్పడిన ఈ నరరూప రాక్షసుడికి న్యాయస్థానం కేవలం 15 ఏళ్ల, 5 నెలల జైలు శిక్ష విధించడంపై స్పెయిన్ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మాటలకందని నేరానికి పాల్పడటంతో పాటు హింసాత్మకంగా తన కన్నతల్లి మాంసాన్ని తిన్న ఈ నరభక్షకుడికి జీవిత ఖైదు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. 2019లో ఈ దారుణ ఘటనకు పాల్పడ్డిన నరరూప రాక్షసుడి పేరు ఆల్బెర్టో శాంచెజ్ గోమెజ్ (28). రెండేళ్ల క్రితం అనగా 2019లో ఈ నరరూప రాక్షసుడు ఈ దారుణ ఘటనకు పాల్పడగా, అప్పట్లోనే అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ లో ఉంచారు. కాగా తాజాగా ఈ కేసులో న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. ఈ నరమాంస భక్షకుడికి 15 ఏళ్ల 5 నెలలు జైలు శిక్ష విధించింది.
రెండేళ్ల కిందట తన తల్లితో చిన్న వివాదం రేగడంతో అమెను దారుణంగా హత్య చేసిన కసాయి.. అమె మాంసాన్ని భక్షించాడు. అయితే తన తల్లి స్నేహితుడు అమె గత కొంత కాలంగా కనిపించడం లేదని అనుమానంతో పోలీసులకు పిర్యాదు చేయగా, వారు అమె నివాసంతో పాటు పలు చోట్ల నిఘా ఏర్పాటు చేశారు. అయితే అమె నివాసం వద్ద అనుమానాస్పందంగా సంచరిస్తున్న అతడిపై పోలీసులు నిఘా పెట్టగా, ఇంట్లోకి వెళ్లిన గోమేజ్ తన తల్లి శరీర భాగాలను తింటూ కనిపించాడు. మరికొన్ని శరీర భాగాలు ప్లాస్టిక్ కంటైనర్లలో గుర్తించారు. ఇది చూసిన పోలీసులు ఖంగుతిన్నారు.
కాగా, కోర్టులో విచారణ సందర్భంగా గోమెజ్ తనకు సైకో నేచర్ వుందని వాదించగా, వాటిని న్యాయమూర్తి విశ్వసించలేదు. ఏమీ తెలియని ఉన్మాద స్థితిలో ఈ పని చేశానని గోమెజ్ చెప్పగా, న్యాయమూర్తి అందుకు అంగీకరించలేదు. మారియాను చిన్న చిన్న ముక్కలుగా నరికి చంపడం, అమె మాంసాన్ని తిన్న కారణంగా అదనపు జైలుశిక్ష వేశారు. తల్లిని హత్య చేసినందుకు 15 ఏళ్లు, ఆమె శరీర భాగాలను తిన్నందుకు మరో 5 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. అంతేకాదు, పరిహారంగా తన సోదరుడికి 60 వేల యూరోలను చెల్లించాలని ఆదేశించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more