తెలంగాణలో కరోనా రెండో దశ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ఆంక్షలను ప్రభుత్వం సడలించే యోచనలో వుంది. ఈ నెల 19తో లాక్ డౌన్ పూర్తి కానున్న తరుణంలో రాష్ట్రంలో పగటిపూట ప్రజలకు వెసలుబాటు కల్పించాలని ప్రభుత్వం అలోచిస్తోంది. దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసుల తగ్గుముఖం పట్టిన క్రమంలో అక్కడి ప్రభుత్వం సడలింపులు ఇచ్చినట్టుగానే ఇక్కడి కూడా కల్పించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. పగలు పలు వాణిజ్య సముదాయాలు, వ్యాపార కేంద్రాలకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచన. దీంతో గాడి తప్పిన రాష్ట్ర అర్థిక వ్యవస్థను మళ్లీ పుంజుకునేలా చేసేందుకు నిర్ణయం తీసుకోనుందని సమాచారం.
ఈ నేపథ్యంలో ఈనెల 19 తర్వాత లాక్ డౌన్ ముగిసన తరువాత ఇక లాక్ డౌన్ స్థానంలో రాష్ట్రవ్యాప్తంగా రాత్రి పూట కర్ప్యూను విధించే యోచనలో ప్రభుత్వం వుందని సమాచారం. ఈ క్రమంలో పగటిపూట మాత్రం లాక్ డౌన్ ఆంక్షల సడలింపు ఉంటుందని సమాచారం. వారం పది రోజుల పాటు నైట్ కర్ఫ్యూ విధించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉండనుందని అధికార వర్గాల ద్వారా అనధికార సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకు కర్ఫ్యూ అమల్లో ఉంది.
ఇక జులై 1 నుంచి రాష్ట్రంలో పగటి పూట కోవిడ్ లాక్ డౌన్ ఆంక్షలు నిలిపివేసి.. అన్ లాక్ ఆంక్షలను అమలుపర్చే యోచనలో ప్రభుత్వం వుందని సమాచారం. వచ్చే నెల నుంచి బార్లు, సినిమా హాళ్లు, జిమ్లకు అనుమతి ఇచ్చేందుకు రెడీ అవుతోంది. 50 శాతం ఆక్యుపెన్సికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా తగ్గినట్లు ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో సడలింపులపై నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణలో పాజిటివ్ రేటు 1.5 శాతానికి తగ్గినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆంక్షల సడలింపు తప్పదని ప్రభుత్వం భావిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more