మాములు అన్ని జాగ్రాత్తలు తెలిసి.. ట్రాఫిక్ రూల్స్ గురించి చిన్పప్పటి నుంచి ఫాలో అవుతున్న మనుషులకే రద్దీగా వుండే రోడ్డును దాటాలంటేనే చాలా కష్టం. ఇక చిన్నారులున్న తల్లి రోడ్డు దాటడం అంటే ఓ గగనమే. ఒక్క తుంటరి చిన్నారి వుంటే ఇక ఆ తల్లి పాట్లు చెప్పనలవి కాదు. కానీ నలుగురు చిన్నారులు అందులో ఇద్దరు చలాకీలు కాగా ఇద్దరు బయస్థులు అయితే.. ఆ నలుగురితో రద్దీ రోడ్డును దాటాల్సి వస్తే.. ఆ తల్లి బాధ వర్ణణానీతం. ఇక ఆ తల్లి మాటలు వచ్చిన మనుషులు కాకుండా భల్లూకమైతే.
దేవుడా తలచుకుంటేనే ఎంతో బాధగా వుంటుంది. ఎవరైనా సాయం చేయడానికి ముందుకు వచ్చినా తన పిల్లలకు హాని చేసేందుకు వస్తున్నారని ఎటుగుబంటి ఏం చేస్తుందోనన్న భయం. ఈ భయాల మధ్య చేసేందేలేక.. తమ పనులను కదిలిపోతు్న కాలంలో కొన్న నిమిషాల పాటు తాత్కాలికంగా బ్రేక్ వేసుకోవడమే వారు చేయాల్సింది. ఏ వాహనం ఆ మార్గంలో రాకపోతే ఎలుగుబంటి తన పిలల్లతో మెల్లిగా రోడ్డు దాటి వెళ్లిపోతుంది. తీరా చూస్తే అక్కడి వారంతా అదే పని చేశారు. తమ తమ వాహనాలను అపేసి నిశబ్దంగా కూర్చున్నారు.
అయితే అలా ఆగినా వెనుక నుంచి ఏ వాహనం దూసుకొచ్చి గుద్దేస్తుందో అన్న అందోళన కూడా నెలకొనింది. ఈ విషయం తెలుసుకన్న పోలీసులు వచ్చి వాహనాలను ముందుకు కదలనీయకుండా నిలిపేశారు. తల్లి ఎలుగుబంటి తన నలుగురు పిల్లలతో రోడ్డు దాటేందుకు ఉపయుక్తం అయ్యింది. అయితే తన నలుగురి పిల్లలో ఇద్దరు పిల్లలు చలాకీగా తల్లిని అనుసరించేవి. అయితే మరో రెండు మాత్రం ఎక్కువగా భయపడుతున్నాయి. దీంతో ఇలా భయపడే ఓ పిల్లను తన నోటితో కరుచుకుని తల్లి ఎలుగుబండి రోడ్డును దాటేసి.. రక్షణ వున్న స్థలంలో దానిని విడిచిపెట్టింది.
తల్లిని వెంటన నడిచిన ఓ చలాకీ ఎలుగుబండి భయపడే పిల్లతో అక్కడే వుండిపోయింది. ఈ క్రమంలో మూడవ ఎలుగుబంటి పిల్ల కూడా రోడ్డును దాటేసి వచ్చింది. ఇలా ఒక పిల్ల మినహా అన్ని రోడ్డు దాటేయడంతో ఆ ఒక్క పిల్ల భయపడి చెట్టును ఎక్కే ప్రయత్నం చేసింది. వెంటనే వచ్చిన తల్తి దానిని కిందకు దింపు దానినిన నోట కరుచుకుని వెళ్లే ప్రయత్నం చేయగా, మూడు పిల్ల తల్లి వేంట మళ్లీ ఇటువైపు కువచ్చి.. ఈ రెండు పిల్లలు తల్లి ఎలుగుబండిని కాసింత మరాం చేశాయి. అయితే చివరకు భయపేడే పిల్లను తీసుకుని ఎటుగుబంటి రోడ్డును దాటేసింది.
అప్పుడే అక్కడి పోలీసు వాహనం కాసింత ముందుకు కదలడంతో ఎలుగుబంటి పిల్లులు మళ్లీ రోడ్డు పైకి వచ్చే ప్రయత్నాన్ని విరమించుకున్నాయి. ఇక తల్లితో కలసి అవి అడవిలోకి వెళ్లిపోయాయి. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసా.? అమెరికాలోని వించెస్టర్ నగరంలో. వించెస్టర్ సిటీ పోలీసులు తల్లి ఎలుగుబంటి నలుగురు పిల్లలను రోడ్డు దాటించేందుకు పడిన ప్రయాసను వీడియో చిత్రీకరించి వారి పేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఓ తల్లి ఎలుగుబంటి నిత్యం బిజీగా ఉండే రోడ్డును దాటేందుకు అనేక ఇబ్బందులు పడింది. పిల్ల ఎలుగుబంట్లను నోటికి కరుచుకొని రోడ్డును దాటింది. ఎక్కడ పిల్లలను కార్లు గుద్దేస్తాయేమో అని భయపడుతూ రోడ్డును దాటిన దృశ్యాలను పోలీసులు తమ పేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more