బీటెక్ చదవాలంటే ఇన్నాళ్లుగా వున్న ప్రతిబంధాకాలకు అఖిల భారత టెక్నికల్ ఎడ్యూకేషన్ కౌన్సిల్ ఇక తొలగించింది. దీంతో ఇన్నాళ్లు ఇంటర్ లో ఎంపీసీ గ్రూపు తీసుకున్న విద్యార్థులకు మాత్రమే అందుబాటులో వున్న ఇంజనీరింగ్ విద్యా ఇకపై అగ్రికల్చర్, బిజినెస్ స్టడీస్ సహా పద్నాలుగు సబెక్టుల వారికి కూడా అందుబాటులోకి రానుంది. ఔనా.. ఇకపై ఇంజనీరింగ్ విద్యకు బోలడంత డిమాండ్ రానుంది. ఇంటర్ వొకేషనల్ కోర్సు చదివినవారైనా ఇక ఇంజనీరింగ్ విద్యలో చేరే అవకాశాలను ఏఐసీటీఈ కల్పించింది.
ఇన్నాళ్లు ఇంటర్ లో గణితం తప్పనిసరిగా ఎంచుకున్న విద్యార్థులకు మాత్రమే అందుబాటులో వున్న ఇంజనీరింగ్ విద్య ఇకపై మరింత మందికి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అఖిల భారత టెక్నికల్ ఎడ్యూకేషన్ కౌన్సిల్ (ఏఐసీటీఈ) నిబంధనలు మార్చింది. వచ్చే విద్యా సంవత్సరానికి వృత్తి విద్యా కళాశాలల అనుమతులకు సంబంధించి విడుదల చేసిన హ్యాండ్ బుక్-2021లో బీటెక్ చదివేందుకు అర్హతలను పేర్కొంది. 2021-22 విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు మాత్రం తప్పనిసరి.
ఏఐసీటీఈ పేర్కొన్న 14 సబ్జెక్టులు భౌతికశాస్త్రం, గణితం, రసాయనశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జీవశాస్త్రం, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్, బయోటెక్నాలజీ, టెక్నికల్ ఒకేషనల్ సబ్జెక్టు, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ గ్రాఫిక్స్, బిజినెస్ స్టడీస్, ఎంటర్ప్రెన్యూర్ షిప్లలో ఏ మూడు సబెక్టులు ఇంటర్ లో చదివి పాసై ఉన్నా ఇంజనీరింగ్ (బీటెక్) చదవుకు అర్హులని అఖిల భారత టెక్నికల్ ఎడ్యూకేషన్ కౌన్సిల్ తమ నూతన హ్యాండ్ బుక్ లో పేర్కోంది. అయితే ఇంజినీరింగ్ లో ఆశించిన ఫలితాలు సాధించేందుకు అవసరమైన గణితం, భౌతికశాస్త్రం, ఇంజినీరింగ్ డ్రాయింగ్ లాంటి సబ్జెక్టుల్లో బ్రిడ్జి కోర్సులను అందించాలని ఇంజినీరింగ్ కళాశాలలకు ఏఐసీటీఈ సూచించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more