తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన తీవ్ర తుఫాను నివర్.. పెను విధ్వంసం సృష్టిస్తూ ఈ తెల్లవారు జామున 2.30 గంటలకు తీరం దాటింది. పెను తుఫానుగా తీరం దాటిన నివర్ ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కోనసాగుతోంది. కాగా నివర్ తుపాను తీరం దాటిన సమయంలో వాతావరణ శాఖ అంచనాలకు మించిన వేగంతో ఈదురు గాలులు వీచాయి. భారత వాతావరణ 110 నుండి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసినా.. నివర్ తుపాను తీరం దాటే సమయంలో అంతకు మించి 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
#WATCH Chennai witnessing spell of strong winds after #Cyclone Nivar made landfall near Puducherry late last night#TamilNadu pic.twitter.com/jZZB3FCJUX
— ANI (@ANI) November 26, 2020
దీనికి తోడు భారీ వర్షాలు కురువడంతో తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల ప్రజలు కంటి మీద కునుకు కరువయ్యింది. మరీ ముఖ్యంగా తిరువణ్ణామలై, కడలూరు, విలుప్పురం, చెన్నై, కల్లకురిచ్చి ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని, మరో మూడు రోజుల పాటు తుపాను ప్రభావం కొనసాగుతుందని హెచ్చరించారు. అటు పుదుచ్చేరి తీర ప్రాంతంలోనూ భారి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఇక దీని ప్రభావం ఇటు ఆంధ్రప్రేదశ్ రాష్ట్రంపై కూడా కోనసాగుతుందని, కోస్తాంధ్ర తీరంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏకధాటిగా కురుస్తున్నాయని అన్నారు. వర్షాలతో తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
తమిళనాడులోని తీర ప్రాంతాల రోడ్లు చెరవులను తలపిస్తున్నాయి, తుపాను ప్రభావంతో తమిళనాడులో ప్రాథమిక అంచనా ప్రకారం 80 చెట్లు నేలకూలాయి, పలు పూరిళ్లు ధ్వంసమయ్యాయి, గాలుల ధాటికి అనేక ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి, రైతన్నలకు కూడా నివర్ తుపాను భారీ నష్టాన్ని మిగిల్చింది. తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షంతో వేల ఎకరాల్లోని పంట నీట మునిగింది. కాగా, తుపాను తీరం దాటిన తరువాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను కోనసాగిస్తున్నాయి. కూలిన చెట్లను యుద్ద ప్రాతిపదికన తొలగిస్తూ.. రవాణ, టెలికమ్యూనికేషన్, విద్యుత్ వ్యవస్థలను పునరుద్దరించేందుకు ఆయా శాఖల సిబ్బంది పనులు కోనసాగిస్తున్నారు.
Tamil Nadu: Waterlogging in parts of Chennai city following overnight rainfall due to #CycloneNivar pic.twitter.com/JivSEFVS3D
— ANI (@ANI) November 26, 2020
(And get your daily news straight to your inbox)
Jan 25 | 2016 నవంబర్ 8వ తేదీ అనగానే దేశ ప్రజలకు బాగా గుర్తుండిపోయే అంశం పాత పెద్ద నోట్ల రద్దు. దాని పర్యవసానం దాదాపుగా ఆరు నెలలు వరకు దేశ ప్రజలపై వుండిపోయింది. అనేక ఆంక్షలు,... Read more
Jan 25 | కన్నడ చలన చిత్ర పరిశ్రమలో విషాదం అలుముకుంది. యువ నటి, కన్నడ బిగ్ బాస్ సీజన్-3 కంటెస్టెంట్ జయశ్రీ రామయ్య తన ఆశ్రమ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు, ఆమె మృతదేహం సీలింగ్... Read more
Jan 25 | వంశపారంపర్య, వారసత్వ రాజకీయాలపై బీజేపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ధీటుగా ఎదుర్కోన్నారు పశ్చిమ బెంగాల ముఖ్యమంత్రి మమతా బెనర్జి మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ. వారసత్వ రాజకీయాలపై తనతో పాటు తన మేనత్త... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికల నిర్వహణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంచాయతీ ఎన్నికలకు రీషెడ్యూల్ చేశారు. పంచాయతీ... Read more
Jan 25 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామపంచాయితీ ఎన్నికలపై కొనసాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ మార్చి తరువాత నిర్వహించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదరుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికలను యధావిధిగా... Read more