Covid 19: 3967 fresh cases reported in AP ఏపీలో 24 గంటల్లో 3967 కేసులు.. 25 మరణాలు

Coronavirus in ap 3967 new covid 19 cases state tally pasts 7 77 lakh mark

covid-19, coronavirus, coronavirus in india, coronavirus in ap, covid-19 in ap, coronavirus updates, coronavirus pandemic, fight against coronavirus, covid-19 outbreak, coronavirus outbreak in andhra pradesh, coronavirus in nellore, coronavirus in Krishna, coronavirus in prakasam, coronavirus in in kadapah, coronavirus in west godavari, coronavirus news, coronavirus latest news, coronavirus latest update, coronavirus andhra pradesh, coronavirus updates

The total number of COVID-19 cases in Andhra Pradesh crosses 77,5470 Mark after 3967 new cases were reported in the last 24 hours, out of which 7,30,109 have so far recovered and have been discharged, while 6382 have died, the state health department said.

ఏపీలో కరోనా విజృంభన: 7.77 లక్షల మార్కును అధిగమించి.. 24 గంటల్లో 3967 కేసులు

Posted: 10/17/2020 10:16 AM IST
Coronavirus in ap 3967 new covid 19 cases state tally pasts 7 77 lakh mark

(Image source from: Ndtv.com)

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతోంది. మే నెల చివరి వారం నుంచి వేగాన్ని పుంజుకున్న కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజుకు వందలాది మందిని తన ప్రభావానికి గురిచేస్తూ ఏకంగా 7 లక్షల 75 వేల మార్కును అందుకోనుంది, ఇక పక్షం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటం అందోళన రేకెత్తిస్తోంది. దాదాపుగా పక్షం రోజులుగా ప్రతీ రోజు నాలుగు వేల మార్కుకు పైగానే కరోనా పాజిటివ్ కేసుల నమోదు.. వరుసగా గత పది రోజులుగా ఐదు వేల మార్కుకు పైగా నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు నిర్థారణతో ఏకంగా ఏడు లక్షల 75 వేల మార్కును అధిగమించనుంది, ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నా వైరస్ ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు.

తమిళనాడు కోయంబేడు మార్కట్ లో విజృంభించిన కరోనా ఏపీపై కూడా తన ప్రభావాన్ని చాటింది. అప్పటి నుంచి కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 5 వేలమార్కుకు చేరువలో కేసులు నమోదు కావడం అందోళనకు గురిచేస్తోంది. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఏకంగా ఏడు లక్షల డెబై ఐదు మార్కును అధిగమించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ తాజా బులిటెన్లో వివరాలను పేర్కోంది. తాజాగా 3967 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో మొత్తంగా 7,75,470 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు పోరుగు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు ఎవరూ లేకపోవడం గమనార్హం.

ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా అత్యధికంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, చిత్తూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో నమోదయ్యాయి. దీంతో పాటు అనంతపురం, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో రమారమి రెండు వందలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి, గత వారం రోజులుగా తగ్గుతున్న ఈ కేసులు మళ్లీ పెరగడంతో స్థానిక అధికార యంత్రాంగంతో పాటు జిల్లా వాసులను కూడా కలవరానికి గురిచేస్తోంది. ఇక రాష్ట్రంలో జిల్లాలవారీగా పరిశీలిస్తే.. ఆనంతపురంలో 233, చిత్తూరు జిల్లాలో 510, తూర్పు గోదావరి జిల్లాలో 608, గుంటూరు జిల్లాలో 246, కడప జిల్లాలో 212, కృష్ణా జిల్లాలో 456, కర్నూలు 100 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి,

నెల్లూరు జిల్లాలో 220, ప్రకాశం జిల్లాలో 355, శ్రీకాకుళం జిల్లాలో 108, విశాఖపట్నం జిల్లాల్లో 206, విజయనగరంలో 86, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ 627 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, వైద్యశాఖ అధికారులు కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేసి.. వైరస్ వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకునన్నారు. ఇక పురపాలక సంఘాలు, గ్రామ పంచాయితీల ఆధ్వర్యంలో కంటైన్ మెంట్ జోన్లలో రసాయనాలు చల్లారు. ఆయా ప్రాంతాలను సానిటైజ్ చేశారు. కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారినపడి 25 మంది అసువులు బాసారు. చిత్తూరు, కడప, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లో అధిక మరణాలు సంభవించాయి,

24 గంటల వ్యవధిలో 25 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. కడప, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పు గోదావరిలో ఇద్దరు మృతి చెందారు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,382కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో కోరాన వైరస్ బారిన పడి చికిత్స పోందుతూ ఇవాళ 5,010 మంది అసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ఈ సంఖ్య  7,30,109 కు చేరడం రాష్ట్రప్రజలకు, వైద్య సిబ్బందికి కొంత ఊరటనిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత్తం 38,979 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనా బారిన పడి.. విదేశాల నుంచి వచ్చి.. చికిత్స పోందుతున్న వారి సంఖ్య 434గా నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సంఖ్య కూడా ఏకంగా 2461కు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles