(Image source from: Oneindia.com)
దేశవ్యాప్తంగా వైద్య విద్యను అభ్యసించేందుకు నిర్వహించే ప్రవేశపరీక్ష నీట్ పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి, నీట్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ఫలితాలు విడుదల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ విద్యార్థులకు పలు సూచనలు ఇచ్చారు. అయితే ఫలితాలను చూసిన తరువాత ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎలాంటి విపరీత నిర్ణయాలకు లోనుకాకూడదని అన్నారు. అయితే ఈ ఫలితాలను చూసుకునేందుకు విద్యార్థులు ఎంత ప్రయత్నించినా వెబ్ సైట్ తెరచుకోకపోవడంతో అందోళనకు గురయ్యారు. ఏకంగా మంత్రికే వైబ్ సైట్ ఓపెన్ కావడం లేదంటూ ట్వీట్ పెట్టారు. మరి ఎన్టీఏ అధికారులు ఎప్పటికి స్పందిస్తారో మరి!
జాతీయ పరీక్షల ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం సాయంత్రం నీట్ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో (2020-21) ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 13న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 14.37లక్షల మందికి పైగా హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 3,862 కేంద్రాల్లో ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు. సెప్టెంబర్ 13న కరోనా నేపథ్యంలో హాజరు కాని విద్యార్థులకు ఈ నెల 14న ప్రత్యేకంగా పరీక్ష రాసే అవకాశం కల్పించారు. తాజాగా ఈ పరీక్ష ఫలితాలను http://ntaneet.nic.in/ వెబ్ సైట్ ద్వారా అధికారులు విడుదల చేశారు.
ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులెవరూ నిరుత్సాహపడవద్దని కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ విన్నవించారు. పరీక్షలలో ఉవారి కోసం ఇతర రంగాల్లో అవకాశాలు ఎదురుచూస్తున్నాయని తెలిపారు. ఒక పరీక్షే మనల్ని నిర్వచించదని, ఆయా రంగాల్లో మీ తెలివితేటలు ఈ దేశానికి ఎంతో అవసరమని తెలిపారు. ఈ ఫలితాల్లో ఒడిశాకు చెందిన సోయబ్ అప్తాబ్ అలిండియా మొదటి ర్యాంకు సాధించాడు. మరోవైపు, ఫలితాలు విడుదల చేసినప్పటికీ వెబ్సైట్ మొరాయించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ మేరకు సర్వర్ డౌన్ అయిందని పేర్కొంటూ కేంద్రమంత్రికి ఫిర్యాదు చేశారు. మరి ఎన్టీఏ అధికారులు ఎప్పటికీ సైట్ ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తుందో మరి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more