(Image source from: Newindianexpress.com)
కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో కోడి మాంసంతోనూ ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందన్న పుకార్ల నేపథ్యంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాల్లో విక్రయాలు పూర్తిగా సన్నగిల్లాయి. ఇక ఉచితంగా ఇస్తామన్నా కోడి మాంసం కోనేవారు లేకుండా కొన్నివారాల పాటు వెలవెలబోయిన దుకాణాలు ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో కోడి మాంసం ధర ఆకాశాన్ని అంటుతున్నా దుకాణాలు ముందు రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఆరు నెలల కిత్రం ఉచితంగా ఇచ్చినా తీసుకునే వారు లేక లేక తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కోళ్ల ఫారంలోని కోళ్లను మేపడం ఖర్చులు కూడా రావడం లేదని బోరుమాన్నారు. చివరకు స్థానిక గ్రామాల్లో ఉచితంగా పంచిపెట్టిన ఘటనలు కూడా వున్నాయి, అలాంటిది ప్రస్తుతం మాత్రం కోడిమాంసంతో పాటు కోడిగుడ్ల ధరలు కూడా మండుతున్నాయి.
ఆదివారం కిలో ధర గరిష్ఠంగా 280 వరకూ ధర పలికిన చికెన్ ధర ఆకాశాన్ని అంటింది. మే నెలలో కిలో 150 ధరల పలికిన చికెన్ నెల నెలా కొంత పెరుగుతూ వచ్చి ఏకంగా గత నెలరోజుల్లోనే కిలోకు రూ.50 మేర పెరగడం కోడిమాంసం ప్రియులను నోరారా తీనే వీలుకూడా లేకుండా చేసింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో చికెన్ తినడం వల్ల రోగనిరోధకశక్తి (ఇమ్యూనిటీ) పెరుగుతోందని ఓ వైపు వైద్యులు (డైటీషియన్లు) మరోవైపు ప్రభుత్వాలు కూడా సూచించిన నేపథ్యంలో చికెన్, కోడిగుడ్ల వినియోగం దేశవ్యాప్తంగా బాగా పెరిగింది. ఈ తరుణంలో లాక్ డౌన్ ప్రారంభానికి ముందు వారానికి ఒకసారి చికెన్ తిన్న కుటుంబాలు ఇప్పుడు 2, 3 సార్లు కొంటున్నాయని విక్రేతలు తెలిపారు. చికెన్, గుడ్లతో పాటు చేపలు, మాంసం వినియోగం బాగా పెరిగి, అమ్మకాలు ఇప్పుడు గరిష్ఠస్థాయికి చేరాయి.
లాక్ డౌన్ సహా వర్క్ ఫ్రం హోం కూడా కోడిమాంసం విక్రయాలకు బాగా దోహదం చేస్తున్నాయని చెప్పారు. ఇక ఈ విక్రయాలకు తోడు కు ముందు రోజుకు 1.80 కోట్ల గుడ్ల అమ్మకాలుండేవి. ఇప్పుడు రోజుకు 2 కోట్ల గుడ్లు అమ్ముతున్నారు. అయినా గుడ్డు ధర చిల్లర మార్కెట్లో రూ.5 నుంచి 6కి చేరింది. అదే ఒరవడిలో అటు చికెన్ ధర కూడా ఏకంగా రూ.280 కి చేరింది. స్కిన్ లెస్ చికెన్ ధర మూడు వందల పైన పలుకగా, బోన్ లెస్ చికెన్ ధర మాత్రం ఏంకగా ఐదు వందల ధర పలికింది. నాటు కోడి మాంసం కూడా ఏకంగా 450 దర పలకడం కోడిమాంస ప్రియులను అందోళనకు గురిచేస్తోంది. ఇళ్లలో గుడ్లు, చికెన్ వినియోగం పెరిగినందున ధరలూ పెరుగుతున్నాయని అది స్వల్పకాలమే ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలంగాణ కోళ్ల పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more